MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • DA Hike : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు

DA Hike : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు

DA Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 3.64% డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ) పెంపు ప్రకటించింది. 2024 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. దీంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.

2 Min read
Mahesh Rajamoni
Published : Oct 21 2025, 11:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Image Credit : stockPhoto

ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ) పెంపు ప్రకటించింది. 2024 జనవరి 1 నుండి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. పెన్షనర్లకు కూడా 3.64% పెంపు అందుతుంది. ఈ నిర్ణయం పై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

24
డీఏ పెంపు: పండగ ముందు బోనస్
Image Credit : X-@ncbn

డీఏ పెంపు: పండగ ముందు బోనస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 33.67% నుండి 37.31% కి పెంచింది. ఈ పెంపు ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, పెన్షనర్లు తమకు లభించే వేతనాలపై 3.64% పెంపు పొందగలుగుతారు. ఈ పెంపును ప్రకటించిన తర్వాత ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంక్షేమం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. ఈ డీఏ పెంపు, దీపావళి పండుగకు ముందుగానే విడుదల కావడం ఉద్యోగుల మేలు కోసం తీసుకున్న కీలక నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ పెంపును సీఎం దీపావళి బోనస్ గా ప్రకటించారు.

Related Articles

Related image1
IMD Rain Alert : అల్లకల్లోలమే.. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
Related image2
రోజూ బంగారం రేటు ఎవరు నిర్ణయిస్తారు? లక్షలు దాటుతున్న గోల్డ్ అసలు లెక్క ఇదే !
34
ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం
Image Credit : Google

ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం

ఆర్థిక శాఖ అధికారుల ప్రకారం, ఈ డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానా పై అదనపు భారం పడనుంది. ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

అలాగే, ఉద్యోగులు వారి పిల్లల సంరక్షణ కోసం 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంటే రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రజా సెక్టార్‌లో పనిచేసే తల్లిదండ్రులకు చక్కని అవకాశాలను ఇస్తుంది.

44
గత బకాయిలను క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం
Image Credit : our own

గత బకాయిలను క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం

ఈ డీఏ పెంపు ప్రకటనతో పాటుగా గత బకాయిలను క్లియర్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రణాళికను త్వరలో పూర్తి చేయడం కూడా ప్లాన్ లో ఉందని తెలిపారు. ఏపీలో 99 శాతం రెవెన్యూ హెచ్ఆర్ కు వెళ్తుందన్నారు. దక్షణాది రాష్ట్రాలను గమనిస్తే కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోందని సీఎం తెలిపారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
పవన్ కళ్యాణ్
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved