ప్రజా పంపిణీ వ్యవస్ధలో జగన్ కొత్త అధ్యాయం
First Published Jan 21, 2021, 7:15 PM IST
ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రేషన్ బియ్యంతో పాటు నిత్యాసవర సరుకులను మొబైల్ వాహనాల ద్వారా నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టంది.

ప్రజా పంపిణీ వ్యవస్ధలో ప్రభుత్వం మరో నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రేషన్ బియ్యంతో పాటు నిత్యాసవర సరుకులను మొబైల్ వాహనాల ద్వారా నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టంది.

ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఇవాళ విజయవాడ బెంజ్ సర్కిల్లో రేషన్ బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసే మొబైల్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

దీంతో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సుమారు 2500 మొబైల్ వాహనాలు బెంజ్ సర్కిల్ నుంచి సంబంధిత ప్రాంతాలకు చేరుకోనున్నాయి.

ముందుగా రేషన్ బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాన్ని పరిశీలించిన సీఎం వైయస్.జగన్... లబ్ధిదారులకు వాహనాలను అప్పగించారు. అనంతరం మొబైల్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ రేషన్ సరుకులు తీసుకోవడానికి తిరిగి ఉపయోగించగలిగే (రీ యూజబుల్) సంచులను ప్రదర్శించారు. ఈ సంచులను బియ్యం కార్డుదారులందరికీ ఒకమారు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

పర్యావరణానికి నష్టం కలిగించని విధంగా.. 10 కిలోలు, 15 కిలోల సైజులో తిరిగి వాడగలిగే సంచులును ఉచితంగా అందజేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9260 మొబైల్ వాహనాలు నేడు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా రేషన్ పంపిణీతో 9,260 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ యువకులకు ప్రభుత్వం నేరుగా జీవనోపాధి కల్పిస్తుంది.

వ్యాన్ డ్రైవర్లకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అధికారులు

సీఎం జగన్కు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
