MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్‌!

Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్‌!

 ఏపీ ప్రభుత్వం రూ.7వేలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనుంది. అర్హతలపై క్లారిటీతో పాటు, ఫిర్యాదుల కోసం జులై 5 నుంచి గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తుంది.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 04 2025, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అన్నదాత సుఖీభవ
Image Credit : Google

అన్నదాత సుఖీభవ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయంగా అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. కేంద్రం పీఎం కిసాన్ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేసే రోజే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.5వేలు కలిపి మొత్తం రూ.7వేలు ఒక్కో రైతు ఖాతాలోకి పంపించనుంది. దీనికి సంబంధించిన అర్హుల జాబితా ఇప్పటికే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

26
రైతు సేవా కేంద్రాల్లో
Image Credit : social

రైతు సేవా కేంద్రాల్లో

ఈ పథకానికి సంబంధించిన సాంకేతిక సమస్యలు లేదా అర్హతలో అనుమానాలు ఉన్న రైతుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జులై 5వ తేదీ నుంచి రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తోంది. డేటాలో లోపాలు, పేర్ల తేడాలు, లేదా హక్కుదారుల సమాచారం లేనివాటిని పరిష్కరించేందుకు ఈ మాడ్యూల్‌ను ఉపయోగించనున్నారు.

Related Articles

Related image1
Andhra Pradesh: తల్లికి వందనం రెండో విడత డబ్బులు..విడుదల చేసేది ఆ రోజే..!
Related image2
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక అన్నీ ఉచితంగానే..!
36
Check Status’ అనే ఆప్షన్‌
Image Credit : Google

Check Status’ అనే ఆప్షన్‌

వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వివరించిన ప్రకారం, రైతులు తమ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అర్హతను సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ https://annadathasukhibhava.ap.gov.in/ లో ‘Check Status’ అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, ఆధార్ నంబర్ నమోదు చేసి, కాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే తాము అర్హులలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు.

46
రైతు సేవా కేంద్రంలో
Image Credit : social media

రైతు సేవా కేంద్రంలో

అర్హత లేనివారు లేదా అర్హతపై సందేహాలు ఉన్నవారు వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు లేదా 155251 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అదనంగా, రైతు సేవా కేంద్రంలో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అక్కడ ఉన్న సిబ్బంది ఫిర్యాదులను పోర్టల్‌లో నమోదు చేస్తారు.

56
టెక్నికల్ సమస్యల వల్ల
Image Credit : iSTOCK

టెక్నికల్ సమస్యల వల్ల

ఒకవేళ భూమి యజమాని మృతిచెందిన తర్వాత వారసుల పేర్లను వెబ్‌ల్యాండ్, అడంగల్, 1బీ డాక్యుమెంట్లలో నమోదు చేయకపోతే, రైతు పథకాలకు అనర్హత వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి డేటా లోపాల వల్ల అసలు భూమి ఉండి కూడా అది సిస్టమ్‌లో కనిపించకుండా పోతుందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. టెక్నికల్ సమస్యల వల్ల వాస్తవిక వివరాలు సరిగా నమోదు కాకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోంది.

66
 ఆటో మ్యూటేషన్ ప్రక్రియ
Image Credit : X

ఆటో మ్యూటేషన్ ప్రక్రియ

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యూటేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామాల్లో 5 వేల పైగా సిరీస్ ఖాతాలు నోషనల్‌గా కనిపించవచ్చునన్న హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇవన్నీ సమీక్షించి, తగిన మార్పులు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రైతులు తమ అర్హత వివరాలు సరిచూసుకునేందుకు లేదా ఫిర్యాదులు చేయడానికి ఈకేవైసీ స్టేటస్ కూడా వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతేకాక, ఈకేవైసీ అవసరమా లేదా అనేది కూడా రైతులకు వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Bus Scheme : మహిళలకే కాదు ఇక ఈ మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Recommended image2
Now Playing
RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu
Recommended image3
Now Playing
Tirumala Temple Reopens After Lunar Eclipse: చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల | Asianet Telugu
Related Stories
Recommended image1
Andhra Pradesh: తల్లికి వందనం రెండో విడత డబ్బులు..విడుదల చేసేది ఆ రోజే..!
Recommended image2
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. ఇక అన్నీ ఉచితంగానే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved