MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh నిరుద్యోగులకు గుడ్ న్యస్‌.. ఇకపై మూడు నెలలకు ఒకసారి

Andhra Pradesh నిరుద్యోగులకు గుడ్ న్యస్‌.. ఇకపై మూడు నెలలకు ఒకసారి

APలో నిరుద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ 1న స్కిల్ పోర్టల్, ఆగస్టులో డీఎస్సీ నియామక ఉత్తర్వులు, మూడు నెలలకు ఓసారి ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నారు.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 05 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
త్వరలోనే ఉపాధి అవకాశాలు
Image Credit : Gemini

త్వరలోనే ఉపాధి అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు త్వరలోనే ఉపాధి అవకాశాలు ఎదురవనున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొత్త కార్యాచరణతో ముందుకు వచ్చారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాను ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

27
స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్
Image Credit : Asianet News

స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్

లోకేష్ స్పష్టంగా పేర్కొన్న ముఖ్య అంశం స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ గురించీ. సెప్టెంబర్ 1 నాటికి ఈ పోర్టల్‌ను పూర్తిగా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పోర్టల్ ద్వారా యువతకు నైపుణ్యాలపై శిక్షణ, అలాగే ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోర్టల్‌లో ఒక్కసారి నమోదు చేసుకుంటేనే వారికి ఆటోమేటిక్‌గా ఒక రెజ్యూమె సృష్టించబడుతుంది. దాంతో కంపెనీలు వారికి తగిన ఉద్యోగాల కోసం నేరుగా సంప్రదించే అవకాశం లభిస్తుంది.

Related Articles

Related image1
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్‌!
Related image2
Andhra Pradesh: ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త...ఇక నుంచి వారికి రూ.30 వేలు పింఛన్‌!
37
ఉద్యోగ మేళా
Image Credit : Gemini

ఉద్యోగ మేళా

అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలను నిర్వహించాలని కూడా ఆయన సూచించారు. ఇది నిరుద్యోగులకు ఏకధాటిగా ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తుందనే ఉద్దేశంతో చేపట్టనున్నారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరు పట్ల ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.

47
లెక్చరర్ల నియామకం
Image Credit : Getty

లెక్చరర్ల నియామకం

ఇక విద్యారంగంలో తీసుకున్న కీలక నిర్ణయాల విషయానికి వస్తే, త్వరలోనే డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు అందించాలని మంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో హైస్కూల్ ప్లస్‌లో లెక్చరర్ల నియామకం కోసం కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారం మాత్రమే కోర్సులు ఉండాలన్నారు.

విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని, ప్రతి అడ్మిషన్‌కు వారి అంగీకారం అవసరమని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఆలస్యం లేకుండా, బకాయిలను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు అర్థికంగా ఇబ్బంది పడకుండా చూడాలన్నదే మంత్రి లక్ష్యం.

57
భాషా సబ్జెక్టుల మార్కులు
Image Credit : social media

భాషా సబ్జెక్టుల మార్కులు

ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విషయంలో భాషా సబ్జెక్టుల మార్కులను సగటుగా పరిగణిస్తూ ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్‌లో ప్రవేశం కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. వారికి ఉన్న అడ్డంకులను తొలగించి, మెరుగైన విద్యా అవకాశాలను అందించాలన్నదే ఆలోచన.

ఇంకా ముఖ్యమైన అంశం – అక్షరాస్యత పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమం. ఆగస్టు 7 నుంచి ‘అక్షర ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు లోకేష్ ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి శిక్షణ ఇవ్వనున్నారు. ఇది పెద్దల విద్యను ప్రోత్సహించడంలో కీలకమైన అడుగు అవుతుంది.

67
కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి శిక్ష
Image Credit : Getty

కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి శిక్ష

విద్యార్ధుల భవిష్యత్‌ కోసం పాఠశాల స్థాయిలోనే కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి శిక్షణ, వ్యక్తిగత భద్రత గురించి అవగాహన కల్పించే శిక్షణలు ప్రారంభించాలని సూచించారు. బాల్యం నుంచే విద్యార్ధుల్లో భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టత ఏర్పడాలన్నదే మంత్రి ఉద్దేశం.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పాల్గొనే మెగా పీటీఎం జరగనుంది. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించాలంటూ మంత్రి అధికారులను కోరారు. ఈ కార్యక్రమం విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్రను బలోపేతం చేయడంలో ఒక దిశానిర్దేశకంగా నిలవనుంది.

77
ఐటీఐల అభివృద్ధి
Image Credit : our own

ఐటీఐల అభివృద్ధి

కేంద్రం నుండి రాబోయే నిధుల విషయానికొస్తే, ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా ఐటీఐల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్లను మంజూరు చేసినట్టు అధికారుల నుంచి సమాచారం అందింది. ఈ నిధులతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

నైపుణ్యాభివృద్ధి శిక్షణల్లో రాష్ట్రాన్ని జోన్‌లుగా విభజించి, అక్కడికి అనుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు కోర్సులు ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు. ఇది ఉద్యోగాలు కోసమే చదువుతున్న యువతకు నేరుగా ప్రయోజనం కలిగించే చర్య అవుతుంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఉద్యోగాలు, కెరీర్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Minister Nara Lokesh Conducts Surprise Inspection at Mylavaram School | Asianet News Telugu
Recommended image2
Now Playing
Koil Alwar Thirumanjanam at Tirumala Temple: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | Asianet News Telugu
Recommended image3
Free Bus: మ‌హిళ‌ల‌తో పాటు వారికి కూడా ఉచిత బ‌స్సు.. ఏపీలో బుధ‌వారం నుంచి కొత్త ప‌థ‌కం
Related Stories
Recommended image1
Andhra Pradesh: అన్నదాత సుఖీభవ పథకం లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి...చాలా సింపుల్‌!
Recommended image2
Andhra Pradesh: ఏపీలో వారికి అదిరిపోయే శుభవార్త...ఇక నుంచి వారికి రూ.30 వేలు పింఛన్‌!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved