Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh Jobs : యువతకు అలర్ట్ ... కేవలం మూడు నెలల్లోనే 16 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

Andhra Pradesh Jobs : యువతకు అలర్ట్ ... కేవలం మూడు నెలల్లోనే 16 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ వేసవి కాలంలో ఉద్యోగాల జాతర జరగనుంది. ఈ మూడు నెలల్లో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఉద్యోగాలేంటో తెలుసా? 

Arun Kumar P | Updated : Feb 26 2025, 05:45 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
AP DSC Recruitment 2025

AP DSC Recruitment 2025

AP DSC Recruitment : ఆంధ్ర ప్రదేశ్ యువతకు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేసారు. మరో మూడు నెలల్లోనే ఏకంగా 16 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని... ఇప్పటికే ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం ప్రకటించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి మెగా డిఎస్సి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే యువతీయువకులు కూటమికి మద్దతుగా నిలిచారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేనాటికి భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇప్పటికే పలుమార్లు విద్యాశాఖమంత్రి నారా లోకేష్ తెలిపారు. 

అయితే తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మెగా డిఎస్సిపై క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత విద్యాసంవత్సరం మరో నెలరోజుల్లో పూర్తవుతుంది... ఆ తర్వాత స్కూళ్లకు వేసవి సెలవులు ఉంటాయి. ఈ సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

ఇలా ఏ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు ఇప్పటికే నాణ్యమైన భోజనం పెడుతున్నాం... వచ్చే విద్యాసంవత్సరం నుండి నాణ్యమైన చదువు కూడా అందిస్తామన్నారు. అందుకోసం బాగా చదువుకున్న యువతను డిఎస్సి ద్వారా టీచర్లుగా నియమిస్తున్నామని... ఈ నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని చంద్రబాబు తెలిపారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను బట్టి చూస్తే వచ్చే అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి టీచర్ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువత ఇప్పుడే అలర్ట్ కావాలి... ప్రిపరేషన్ ను మరింత సీరియస్ గా తీసుకోవాలి. భారీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కాబట్టి పోటీ కూడా అదేస్థాయిలో ఉంటుంది... ఇప్పటినుండే బాగా ప్రిపేర్ అయితేనే కలలుగనే జాబ్ ను సాధించగలరు. 
 

23
Ammaku Vandanam

Ammaku Vandanam

అమ్మకు వందనం పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ : 

గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన,బిజెపి కూటమిని ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లడంలో సూపర్ సిక్స్ హామీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కూటమి విజయంలో ఈ హామీల పాత్ర మరిచిపోలేనిది. అందువల్లే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే ఈ హామీల అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టిపెట్టారు. 

తాజాగా ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ తో పాటు ఇతర ఎన్నికల హామీల గురించి ప్రస్తావించారు. ఇప్పటికే ఏ హామీని నెరవేర్చారు... త్వరలో ఏవి నెరవేర్చబోతున్నారో వివరించారు. ఈ క్రమంలోనే అమ్మకు వందనం పథకం ఎప్పటినుండి ప్రారంభిస్తారో క్లారిటీ ఇచ్చారు సీఎం. 

ఈ వేసవికాలం ముగియకముందే అంటే నూతన అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే అమ్మకు వందనం పథకాన్ని అమలుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరి చదువు కోసం డబ్బులు ఇస్తామన్నారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంత డబ్బు తల్లి బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమచేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేసారు. 
 

33
Annadata Sukhibhava

Annadata Sukhibhava

రైతులకు పెట్టుబడి సాయంతో సహా ఇతర పథకాల గురించి చంద్రబాబు ఏమన్నారంటే : 

ఇక కూటమి ఎన్నికల హామీల్లో మరో కీలకమైనది అన్నదాత సుఖీభవ... అంటే రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం. ఈ పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలను వ్యవసాయ ఖర్చులకోసం అందిస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఏడాది పీఎం కిసాన్ పేరిట రైతులకు రూ.6,000 పెట్టుబడి సాయం చేస్తోంది. వీటికి ఇంకో 14 వేలు అదనంగా జోడించి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇలా రైతుల మేలుచేసే ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం స్పష్టం చేసారు. 

ఇక మత్స్యకారులు చేపల వేట విరామం సమయంలో రూ.20 వేలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరుద్యోగులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని... త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
నారా చంద్రబాబు నాయుడు
 
Recommended Stories
Top Stories