MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Andhra Pradesh లో మరో ప్రఖ్యాత సంస్థ.. 8000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వం

Andhra Pradesh లో మరో ప్రఖ్యాత సంస్థ.. 8000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ఏరోస్పేస్ పార్క్ స్థాపన చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ అన్నారు. దీని కోసం సుమారు 8 వేల ఎరాల భూమిని కేటాయించనున్నట్లు మంత్రి చెప్పారు.

2 Min read
Author : Bhavana Thota
Published : Jul 16 2025, 11:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏరోస్పేస్ పార్క్
Image Credit : our own

ఏరోస్పేస్ పార్క్

బెంగళూరుకు సమీపంలో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆలోచనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. దేవనహళ్లి ప్రాంతంలో రైతుల భూములు తీసుకోవాలన్న ప్రణాళికపై రైతులు 1,100 రోజులకు పైగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములు సేకరించవద్దని, భూసేకరణకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం
Image Credit : X

పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం

రైతుల ఆందోళనను విరమింపజేసిన ప్రకటన తర్వాత మరో రాష్ట్రం మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు దూసుకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్‌ స్పందిస్తూ, కర్ణాటక వదులుకున్న ఏరోస్పేస్ పార్క్ పెట్టుబడులకు ఏపీ ఆహ్వానం పలికింది. లోకేశ్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్పందిస్తూ, కర్ణాటక నిర్ణయం వినడం బాధగా ఉందన్నా, తమ వద్ద మంచి ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

35
ఏరోస్పేస్ పాలసీ
Image Credit : others

ఏరోస్పేస్ పాలసీ

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని అమలు చేస్తోందనీ, పెట్టుబడిదారులకు లభించే మద్దతు, ప్రోత్సాహకాలు దేశంలోనే ఉత్తమమైనవని మంత్రి వివరించారు. బెంగళూరుకు సమీపంలోనే వందలాది ఎకరాల భూమి వినియోగానికి సిద్ధంగా ఉందని, త్వరలో ఏరోస్పేస్ రంగంలోని ప్రముఖుల్ని కలుస్తానని కూడా లోకేశ్‌ తెలిపారు.

45
స్వచ్ఛందంగా భూములను
Image Credit : our own

స్వచ్ఛందంగా భూములను

చెన్నరాయపట్టణం, దేవనహళ్లి తాలూకాల్లోని భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు గత మూడున్నరేళ్లుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. చివరకు ప్రభుత్వం పర్యవేక్షణలో రైతు సంఘాల నేతలతో సమావేశమైన అనంతరం సీఎం సిద్ధరామయ్య తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వారినుంచే భూములు తీసుకుంటామని, వారికి తగిన నష్టపరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

55
ఏరోస్పేస్ పార్క్ స్థాపన
Image Credit : our own

ఏరోస్పేస్ పార్క్ స్థాపన

భూములను ఇవ్వదలచుకోని రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిశ్రమల అభివృద్ధి అవసరమే అయినా, రైతుల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం పేర్కొన్నారు.ఇక ఈ అంశంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా స్పందించారు. సిద్దరామయ్య రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. సామాజిక న్యాయం మాటల్లో కాదు, పనుల్లో చూపారని అభిప్రాయపడ్డారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఏరోస్పేస్ పార్క్ స్థాపనకు కొత్త అవకాశాలు తలుపుతట్టాయి. ఈ అవకాశాన్ని పట్టాలెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొస్తూ, పెట్టుబడిదారులకు దోహదం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ పునర్‌ప్రారంభానికి అనుగుణంగా రాష్ట్రం లోకేష్ నేతృత్వంలోని ఐటీ విభాగం ద్వారా పరిశ్రమలకు కొత్త ఊపునిచ్చే ప్రయత్నాల్లో ఉంది.

About the Author

BT
Bhavana Thota
భావన మహిళా జర్నలిస్ట్. ఈమె 10 ఏళ్లుగా పాత్రికేయరంగంలో ఉన్నారు. స్థానిక వార్తలు మొదలుకుని అంతర్జాతీయ వార్తల దాకా ఏ అంశంపై అయినా సులభంగా అర్థం అయ్యేలా కథనాలు రాయగలగడం భావన ప్రత్యేకత. ఈమె ఈనాడులో దాదాపు ఆరేళ్లు పని చేశారు. తొలివెలుగు, ఆర్టీవీలోనూ ఈమె పలు కేటగిరీలకు సబ్ ఎడిటర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
నారా లోకేష్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
Andhra Pradesh: ఆ విద్యార్థుల కుటుంబాలకు రూ.3 లక్షలు అందజేత..!
Recommended image2
ఐటీలో హైదరాబాద్ తో Andhra Pradesh పోటీ... లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved