MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Andhra Pradesh
  • Andhra Police: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబూబకర్ సిద్ధిక్.. సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ పోలీసులు

Andhra Police: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబూబకర్ సిద్ధిక్.. సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ పోలీసులు

Andhra Police: రాయచోటిలో అరెస్టైన అబూబకర్ సిద్ధిక్ బాంబుల తయారీలో నిపుణుడిగా గుర్తించిన ఏపీ పోలీసులు.. అతను పలు తీవ్రవాద ఘటనల్లో పాలుపంచుకున్నాడని సంచలన విషయాలు వెల్లడించారు.

2 Min read
Mahesh Rajamoni
Published : Jul 05 2025, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
అబూబకర్ సిద్ధిక్‌ పెద్ద ముళ్ల చేప.. ఉగ్రదాడులతో సంబంధాలు
Image Credit : X/AP Police

అబూబకర్ సిద్ధిక్‌ పెద్ద ముళ్ల చేప.. ఉగ్రదాడులతో సంబంధాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటిలో ఇటీవల తమిళనాడు ఎంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత తీవ్రవాదుల్లో ఒకరైన అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ ను పెద్ద ముళ్ల చేపగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఇతడు అత్యంత ప్రమాదకరమైన బాంబుల తయారీలో నిపుణుడిగా ఉన్నాడని కర్నూల్‌ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కొయ ప్రవీణ్ తెలిపారు.

ఒంటరిగా పనిచేసే తీవ్రవాది అబూబకర్ సిద్ధిక్

"ఈ వ్యక్తి సాధారణంగా ఉండే వ్యక్తి కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇతడు దేశం మొత్తం పర్యటించి, గల్ఫ్ దేశాలకు కూడా తరచుగా ప్రయాణించిన వ్యక్తి. జకీర్ నాయక్‌ ఆలోచనా ధారలో నడిచే, ఒంటరిగా పనిచేసే తీవ్రవాది. ఐఈడీలు, టైమర్ బాంబులు, ఇతర ఎలక్ట్రానిక్ పేలుళ్ల పరికరాల తయారీలో నిపుణుడు" అని డీఐజీ ప్రవీణ్ తెలిపినట్టు పీటీఐ నివేదించింది.

తమిళనాడు ఎటిఎస్ ఇటీవల అబూబకర్ సిద్ధిక్, అతని సహచరుడు మొహమ్మద్ అలీని అనంతపురం జిల్లా రాయచోటిలో అరెస్టు చేసింది.

24
అబూబకర్ సిద్ధిక్ నుంచి ఆయుధాలు, పరికరాలు స్వాధీనం
Image Credit : our own

అబూబకర్ సిద్ధిక్ నుంచి ఆయుధాలు, పరికరాలు స్వాధీనం

అబూబకర్ సిద్ధిక్ నివాసంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోయినా, పోలీసులు కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసిన వస్తువుల్లో కత్తులు, కర్రలు, డిజిటల్ టైమర్లు, క్లాక్ స్విచ్‌లు, స్పీడ్ కంట్రోలర్లు, బాల్ బెరింగ్స్, నట్స్ అండ్ బోల్ట్స్, బైనాక్యులర్లు, వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి.

అంతేకాక, పెద్ద నగరాల మ్యాప్లు, కోడింగ్ మాన్యువల్స్, ఐసిస్ ప్రభావిత సాహిత్యం, ఆస్తి పత్రాలు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, చెక్ బుక్స్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Two dreaded terrorists from Tamil Nadu - Abubacker Siddique and Mohammed Ali arrested from Andhra Pradesh. 

20 kg explosives seized from them.

They were involved in terrorist attack on former Deputy PM and Bharat Ratna LK Advani. pic.twitter.com/y53RC57d6t

— Treeni (@TheTreeni) July 5, 2025

Related Articles

Defence: భారత అమ్ములపొదిలో ఏఐ మెషిన్ గన్స్.. శత్రుదేశాలకు దడపుట్టిస్తున్న వీటి ప్రత్యేకత ఏంటి?
Defence: భారత అమ్ములపొదిలో ఏఐ మెషిన్ గన్స్.. శత్రుదేశాలకు దడపుట్టిస్తున్న వీటి ప్రత్యేకత ఏంటి?
Pawan Kalyan: వైఎస్ఆర్సీపీ మళ్లీ రాదు.. పిచ్చివేశాలు వేస్తే తొక్కిపట్టి నారతీస్తాం.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
Pawan Kalyan: వైఎస్ఆర్సీపీ మళ్లీ రాదు.. పిచ్చివేశాలు వేస్తే తొక్కిపట్టి నారతీస్తాం.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్
34
బీజేపీ కార్యాలయంలో బాంబు దాడిలో అబూబకర్ సిద్ధిక్ పాల్గొన్నట్టు ఆరోపణ
Image Credit : X- K.Krishna Sagar Rao

బీజేపీ కార్యాలయంలో బాంబు దాడిలో అబూబకర్ సిద్ధిక్ పాల్గొన్నట్టు ఆరోపణ

డీఐజీ ప్రకారం.. అబూబకర్ సిద్ధిక్ రాయచోటిలో స్థిరపడిన తర్వాత, బెంగళూరులోని బీజేపీ మల్లేశ్వరం కార్యాలయంలో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.

ఈయనపై మరో తీవ్రవాద దాడి కేసు కూడా ఉంది. 2011లో తమిళనాడు మధురైలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నిర్వహించిన రథయాత్ర సమయంలో పైప్ బాంబులను అమర్చే యత్నంలో అబూబకర్ సిద్ధిక్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.

44
పార్సెల్ బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు
Image Credit : our own

పార్సెల్ బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు

జూలై 3న పోలీసులు అబూబకర్ సిద్ధిక్, అలీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పార్సెల్ బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ చర్యలన్నింటిని కేంద్ర ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, ఇతర అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల సమన్వయంతో కొనసాగిస్తున్నారు.

అబూబకర్ సిద్ధిక్ ఒంటరిగా ఉంటూ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, టెక్నికల్ నిపుణతను ఇతరులతో పంచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. జకీర్ నాయక్‌ మాటల ప్రభావంతో సిద్ధిక్ మారిపోయినట్టు సమాచారం.

పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డేటాను విశ్లేషిస్తూ, అబూబకర్ సిద్ధిక్ గల సంబంధాలు, విస్తృత నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర గూఢచార సంస్థలు ఆ విషయమై దృష్టి సారించాయి.

#AndhraPradesh---

Two #terror suspects nabbed after 30 yrs on the run

Abubacker Siddique & Mohammed Ali arrested in #Rayachoti, AP.

20 kg #explosives, timers, #ISIS literature seized.

Linked to #Advani pipe bomb plot & multiple #blasts.

Lived as #traders ,under fake IDs.… pic.twitter.com/6GyBgDWJ8F

— NewsMeter (@NewsMeter_In) July 3, 2025

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
పోలీసు భద్రత
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved