Asianet News TeluguAsianet News Telugu

ఇడ్లీల కోసం ఏకంగా రూ.6 లక్షల ఖర్చు పెట్టిన కస్టమర్ .. దేశంలో సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు , స్విగ్గీ రిపోర్ట్

 ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఏడాది ప్రజల ఆహార అభిరుచులు, ప్రాధాన్యతలు, కోరికలు, భారతీయులు  ఏయే ఆహారాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు వంటి ఆసక్తికరమైన విషయాలను  'Annual Trends Report: How India Swiggy'd 2023' పేరుతో వెల్లడించింది. 

What Foods Indians Ordered The Most In 2023 - This And More In Swiggy Report ksp
Author
First Published Dec 14, 2023, 8:29 PM IST

మరికొద్దిరోజుల్లో 2023 కాలగర్భంలో కలిసిపోనుంది. సరికొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రపంచం అడుగుపెట్టనుంది. గడిచిపోయిన ఏడాదిలో తీపి జ్ఞాపకాలు, సంతోషం, దు:ఖం, ఓటమి, గెలుపు , సాధించిన ప్రగతిని మనిషి మననం చేసుకుంటున్నాడు. అలాగే 2023లో మనలో ఎంతోమంది కొత్త కొత్త రుచులు ఆస్వాదించి వుంటారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఏడాది ప్రజల ఆహార అభిరుచులు, ప్రాధాన్యతలు, కోరికలు, భారతీయులు  ఏయే ఆహారాలను ఎక్కువగా ఆర్డర్ చేశారు వంటి ఆసక్తికరమైన విషయాలను  'Annual Trends Report: How India Swiggy'd 2023' పేరుతో వెల్లడించింది. 

ఎవరు ఏం, ఎక్కడ ఆర్డర్ చేసారు :

ముంబైలోని సందడిగా వున్న వీధుల నుంచి ఢిల్లీ నడిబొడ్డు వరకు భారతదేశంలోని ఆహార ప్రియులు ఆర్డర్లు ఇవ్వడంలో చురుగ్గా వున్నారని స్విగ్గీ తెలిపింది. దేశవ్యాప్తంగా స్విగ్గీ మెనూలో 6.6 మిలియన్లకు పైగా ప్రత్యేకమైన వంటకాలు అందుబాటులో వున్నాయి. కొందరు వినియోగదారులు "Swiggy" , "order" లలో శోధిస్తున్నప్పుడు వరుసగా 5028, 1682 సార్లు వారు వెతుకున్నది కనిపించలేదు. 

2023 ఆర్డరింగ్ స్టార్స్:

ముంబైలోని ఓ వ్యక్తి 42.3 లక్షల రూపాయల విలువైన ఫుడ్ ఆర్డర్‌లను సంపాదించగలిగాడని స్విగ్గీ తెలిపింది. పెద్ద నగరాలు మాత్రమే కాదు.. ఝాన్సీ వంటి చిన్న పట్టణాలకు చెందిన వారు కూడా భారీగా ఆహారాన్ని ఆర్డర్ చేశాయి. ఓ వినియోగదారుడు పార్టీ కోసం ఒకేసారి 269 వస్తువులను ఆర్డర్ చేశాడట. 

ఎక్కువమంది ఆర్డర్ చేసిన వంటకాలు :

7.7 మిలియన్లకు పైగా ఆర్డర్‌లతో దుర్గాపూజ సందర్భంగా గులాబ్ జామూన్‌లు రసగుల్లాపై పైచేయి సాధించాయి. నవరాత్రులు జరిగిన మొత్తం 9 రోజులూ టాప్ వెజ్ ఆర్డర్‌గా మసాలా దోశ నిలిచింది. హైదరాబాద్‌లో ఒక కస్టమర్‌ ఇడ్లీ కోసం ఏకంగా 6 లక్షలు వెచ్చించాడు. సెకనుకు 2.5 బిర్యానీలు ఆర్డర్ చేయడంతో వరుసగా 8వ ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా బిర్యానీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుందని స్విగ్గీ తెలిపింది. 

'ది కేక్ క్యాపిటల్'గా ఆవిర్భవించిన నగరం:

చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్‌లతో బెంగళూరు 'కేక్ క్యాపిటల్' టైటిల్‌ను క్లెయిమ్ చేసింది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 271 కేక్‌లు ఆర్డర్ చేశారట. 

మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన వంటకాలు :

Swiggy గిల్ట్‌ఫ్రీలో శాకాహార ఆర్డర్‌లు 146% పెరగడంతో ఈ కేటగిరీలో వున్నవారు హర్షం వ్యక్తం చేశారు. జపనీస్ , కొరియన్ వంటకాల మధ్య జరిగిన యుద్ధంలో Anime విజయం సాధించింది. జపనీస్ వంటకాలు 2 రెట్లు ఎక్కువ ఆర్డర్‌లను స్కోర్ చేశాయి. 

డైనింగ్ అవుట్‌లు, సేవింగ్స్:

Swiggy One , One Lite వినియోగదారులు రూ.900 కోట్లకు పైగా సేవింగ్స్‌ను పొందారు. తర్వాత Swiggy Dineout వినియోగదారులు రూ.300 కోట్లను ఆదా చేశారు. ఇన్‌స్టామార్ట్ ఔత్సాహికులు 'ఇన్‌స్టా-పూర్' నుండి ఆర్డర్ చేసారు. జైపూర్‌లోని ఒక వినియోగదారు ఒకే రోజులో 67 ఆర్డర్‌లు చేయగా.. ఢిల్లీలో ఇన్‌స్టంట్ నూడుల్స్ డెలివరీకి కేవలం 65 సెకన్ల సమయం పట్టిందని స్విగ్గీ స్పష్టం చేసింది. 

2023కి వీడ్కోలు పలుకుతున్నప్పుడు ఈ గణాంకాలు భారతదేశవ్యాప్తంగా వైవిధ్యమైన రుచిని, దేశంలో నానాటికీ విస్తరిస్తున్న ఆహార సంస్కృతిని తెలియజేస్తున్నాయని స్విగ్గీ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios