వరల్డ్ ప్రీమియర్ సాహోతో గ్రాండ్ గా దసరా ప్రారంభిస్తున్న జీ తెలుగు..!
అక్టోబర్ 18 ఆదివారం నాడు, సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో తప్పక వీక్షించండి. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దసరాకు ప్రసారంకానున్న సాహో గురించి ప్రభాస్ ఇటలీ నుంచి ఒక వీడియో పంపించారు. అందులో మాట్లాడుతూ, “హాయ్, డార్లింగ్స్, ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా సాహో అక్టోబర్ 18 న 4: 30 PM జీ తెలుగులో ప్రసారం కానుంది. చూసి ఎంజాయ్ చేయండి'' అన్నారు.
ప్రతిరోజు అందరిని అలరించే జీ తెలుగు ఈసారి దసరా సందర్భంగా ఛానల్ అభిమానులకు కానుకగా 'సాహో' సినిమాను వరల్డ్ తెలుగు టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతుంది. అక్టోబర్ 18 ఆదివారం నాడు, సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో తప్పక వీక్షించండి. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దసరాకు ప్రసారంకానున్న సాహో గురించి ప్రభాస్ ఇటలీ నుంచి ఒక వీడియో పంపించారు. అందులో మాట్లాడుతూ, “హాయ్, డార్లింగ్స్, ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా సాహో అక్టోబర్ 18 న 4: 30 PM జీ తెలుగులో ప్రసారం కానుంది. చూసి ఎంజాయ్ చేయండి.”
కథ విషయానికి వస్తే, వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్స్టర్స్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. రాయ్ (జాకీ ష్రాఫ్) ఓ గ్రూప్ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు. ఆ క్రైమ్ వరల్డ్కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్ (చంకీ పాండే), రాయ్ మీద పగ పెంచుకుంటాడు. ఓ పని మీద ముంబై వచ్చిన రాయ్ ప్రమాదంలో చనిపోతాడు. ఇదే అదునుగా భావించిన దేవరాజ్ క్రైమ్ వరల్డ్ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో రాయ్ కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్లోకి అడుగుపెడతాడు. మరోవైపు ముంబైలో ఓ భారీ చోరీ జరుగుతుంది. రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేయడానికి అండర్ కవర్ కాప్గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) తో కలిసి కేసు విచారణ మొదలు పెడతాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చివరకు అశోక్ ఆ కేసును సాల్వ్ చేశాడా...? అసలు క్రైమ్ సిండికేట్ను నడిపే రాయ్ ఎలా చనిపోయాడు? అశోక్, అమృత ప్రేమ ఏమైంది...? అసలు ఈ కథలో సాహో ఎవరు?అసలు సాహో ఎవరు? తన కథ ఏమిటి అని తెలుసుకోవాలంటే అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి చూడాల్సిందే.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించిజీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు. 2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు. ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.
విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.. అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు. అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది. ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.