స్వర్ణ ప్యాలెస్ మీద స్పందన: నోటీస్ జారీకి పోలీసులు రెడీ
ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్ చౌదరి తన బంధువు కావడంతో అంతటి సాహసం చేస్తాడా? తన తప్పుని సరిదిద్దుకుంటాడా? బాధితులకు అండగా నిలుస్తాడా? లేదా సైలైంట్ అయిపోతాడా ? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
రామ్ చాలా వరకు ప్రైవేట్ లైఫ్నే ఇష్టపడుతుంటాడు. ఆయన ఇతర హీరోల్లాగా బయట కనిపించే సందర్భాలు చాలా అరుదు. అసలు లేవనే చెప్పాలి. తన సినిమా రిలీజ్ టైమ్లో తప్ప ఇంకెప్పుడు ఆయన స్పందించరు. సామాజిక సమస్యలు, విపత్తుల టైమ్లో కూడా ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండరు. పూర్తిగా వివాదాలకు అతీతంగా ఉంటారు.
కానీ ఉన్నట్టుండి ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు. తన బంధువుని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆయన రియాక్ట్ అయ్యాడు. ఇటీవల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్ని ప్రమాద దారుణానికి బాధ్యులైన రమేష్ ప్రసాద్ ఆసుపత్రి అధినే రమేష్ చౌదరి రామ్కి బాబాయ్ కావడం, ఆయనకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే.
ఈ విషయంలో రామ్పై ఆయన అభిమానుల నుంచి కూడా నెగటివ్ రియాక్షన్ వచ్చింది. ఇలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని, ఆచితూచి స్పందిస్తే బాగుండనే అభిప్రాయం ఆయన అభిమానుల నుంచి వస్తోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రామ్ని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. రామ్చేసిన ట్వీట్ జనాల్లో కూడా రాంగ్ ఇంప్రెషన్ పడేలా చేస్తుంది.
అయితే మొత్తానికి రామ్ రియలైజ్ అయ్యాడు. తాను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకున్నాడు. ఇకపై స్పందించనని తను వివరణ కూడా ఇచ్చాడు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తనపై రావాల్సినంత బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఆయన చేయాల్సింది దోషులకు వ్యతిరేకంగా పోరాడటం. ఈ ఘటనలో దోషులను శిక్షించాలని ట్వీట్లు చేయాలి. కానీ ఈ ఘటనకు బాధ్యుడైన రమేష్ చౌదరి తన బంధువు కావడంతో అంతటి సాహసం చేస్తాడా? తన తప్పుని సరిదిద్దుకుంటాడా? బాధితులకు అండగా నిలుస్తాడా? లేదా సైలైంట్ అయిపోతాడా ? అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. మరి ఈ విషయంలో ఆయన ఏం చేస్తాడో చూడాలి.
ఇక గతేడాది `ఇస్మార్ట్ శంకర్`తో అదిరిపోయే హిట్ని అందుకుని పూర్వ వైభవాన్ని సంపాదించుకున్న రామ్ ప్రస్తుతం సస్పెన్స్ యాక్షన్ థ్రిలర్ `రెడ్`లో నటిస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.