Asianet News TeluguAsianet News Telugu

#BossParty : వైజాగ్ హార్బర్ ని వాల్తేర్ వీరయ్య ఎందుకు వద్దనుకున్నాడు?

 వైజాగ్ పోర్ట్ లోనో లేక కాకినాడ పోర్ట్ లోనో  ఈ పాట తీయకుండా ప్రత్యేకంగా సెట్ వేయటంలో ఆంతర్యం ఏమిటనేది అర్దం చాలా మందికి అర్దం కాలేదు. మరో ప్రక్క చిరంజీవి ..ఈ సెట్ గురించి, ఎఎస్ ప్రకాష్ పనితనం గురించి అద్బుతంగా చెప్తున్నారు. 

Why Did Waltair Veerayya Avoided Vizag Harbour?
Author
First Published Nov 23, 2022, 8:59 AM IST


చాలా ఏళ్లగా తెలుగు సినిమాలు ..వైజాగ్ హార్బర్ లో షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా చాలా జరుపుకున్నాయి. ఘరానా మొగడు లోని బంగారు కోడి పెట్ట సాంగ్ ని,గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ ని అక్కడే షూట్ చేసారు. ఇంకా చాలా పాటలు అక్కడ తీసినవి పాపులర్ అయ్యినవి ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా టైటిల్ లోనే వాల్తేరు వీరయ్య అని వస్తున్న చిరంజీవి తాజా చిత్రం లోని చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ #BossParty బాస్ పార్టీ మాత్రం హార్బర్  స్పెషల్ సెట్ వేసి హైదరాబాద్ లోనే తీసారు. 

ఆర్ట్ డైరక్టర్ ఎఎస్ ప్రకాష్ అద్బుతమైన పనితనంతో ఆ సెట్ రూపొందించారు అందులో తిరుగులేదు. అయితే వైజాగ్ పోర్ట్ లోనో లేక కాకినాడ పోర్ట్ లోనో  ఈ పాట తీయకుండా ప్రత్యేకంగా సెట్ వేయటంలో ఆంతర్యం ఏమిటనేది అర్దం చాలా మందికి అర్దం కాలేదు. మరో ప్రక్క చిరంజీవి ..ఈ సెట్ గురించి, ఎఎస్ ప్రకాష్ పనితనం గురించి అద్బుతంగా చెప్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సినిమాలోని కొన్ని ఫైట్స్ , కీ సీన్స్ ..వైజాగ్, కాకినాడ పోర్ట్ లలో తీసారని చెప్తున్నారు. అయితే పాట తీయటం మాత్రం అనుకున్నంత ఈజి కాదని, కొత్తగా చూపించాలంటే సెట్ బెస్ట్ అని డిసైడ్ అయ్యారని వినికిడి. ఈ మధ్యన సర్కారు వారి పాట సినిమా కోసం వైజాగ్ ఆర్కే బీచ్ సీన్స్ ని ..హైదరాబాద్ లో సెట్ వేసి తీసారు. షూటింగ్ కు వచ్చే జనాలను కంట్రోలు చేయటం కష్టమని ఇలా సెట్స్ వేసి చేస్తున్నారని తెలుస్తోంది.
    
ఇక "వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ... బాస్ పార్టీ" అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఈ రోజు   (నవంబరు 23) సాయంత్రం 4.05 గంటలకు  రిలీజ్ కానుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్... "నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో... బాస్ వస్తుండు, బాస్ వస్తుండు" అంటూ పక్కా మాస్ పదాలతో దుమ్ము దులిపిన  ఈ ప్రోమో వైరల్ అయ్యింది.ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆలపించారు. ఈ గీతానికి దేవిశ్రీనే సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన తళుక్కుమన్నట్టు తెలుస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో శ్రుతిహాసన్, రవితేజ, కాథరిన్ ట్రెసా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios