Asianet News TeluguAsianet News Telugu

హోల్ సేల్ గా వాల్తేరు వీరయ్య- వీరసింహారెడ్డి నైజాం హక్కులు... ఎంత పలికాయంటే?

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య  చిత్రాలను నైజాంలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ చిరంజీవి, బాలయ్య చిత్రాలతో మొదటి అడుగు వేయనున్నారట. 
 

waltaire veerayya and veerasimhareddy nizam rights details
Author
First Published Nov 10, 2022, 5:22 PM IST


నైజాం కింగ్ గా దిల్ రాజు అవతరించాడు. ఆయన చెప్పిందే వేదంగా మారుతుంది. ఈ క్రమంలో కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ లోకి ప్రవేశించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇటీవల ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. మొదటగా తమ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాల నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 35 కోట్లుగా వాల్యూ కట్టారట. 

వాల్తేరు వీరయ్య సినిమాను దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఊర మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. సినిమా వైజాగ్ నేపథ్యంలో సాగనుంది. రవితేజ కీలక రోల్ చేస్తున్నారు. దీపావళి కానుకగా విడుదలైన టీజర్ మెప్పించింది. ఇక వీరసింహారెడ్డి చిత్రాన్ని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. వీరసింహారెడ్డి టైటిల్ తో పాటు ప్రోమోలు అదిరిపోయాయి. అఖండ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డిపై కూడా భారీ అంచనాలున్నాయి. 

మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు చిత్రాల్లో ఒకదాన్ని సంక్రాంతి బరి నుండి తప్పిద్దాం అనుకున్నారట. అయితే బాలయ్య, చిరంజీవిలలో ఎవరూ కాంప్రమైజ్ కాలేదట. సంక్రాంతి సీజన్ కావడంతో ఎన్ని చిత్రాలు విడుదలైన కలెక్షన్స్ రాబట్టవచ్చు. దీంతో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు ఒకేసారి విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. బాలయ్య-చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీపడి చాలా కాలం అవుతుంది. మరి ఈసారి విన్నర్ ఎవరు అవుతారో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios