అగ్నిహోత్రి తదుపరి మరో స్ఫూర్తిదాయకమైన కథతో తిరిగి వస్తున్నాడు. అతడు తెరకెక్కించిన 'ది వ్యాక్సిన్ వార్' ప్రచార కార్యక్రమాల్లో తన సినిమా గురించి విమర్శించిన నసీరుద్దీన్ పై ఊహించని పంచ్ వేసాడు.
బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ది కాశ్మీర్ ఫైల్స్, గదర్ 2, ది కేరళ స్టోరీ వంటి చిత్రాలని ఉద్దేసిస్తూ... ఈ సినిమాల్లో చాలా జింగోయిజం ఉంది. వీటిని ప్రజలు ఆదరించడం మంచి పరిణామం కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని కొందరు సమర్దిస్తూంటే మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి వ్యగ్యంగా స్పందించారు.
అగ్నిహోత్రి మాట్లాడుతూ “ఏది మంచి సినిమా.., ఏది చెడ్డ సినిమా అనేది ఆయనే నిర్ణయించాలి. భారతదేశాన్ని ఎప్పుడూ విమర్శించే సినిమాలంటే ఆయనకు ఇష్టమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కొందరు జీవితంలో నిరాశకు గురై ఉంటారు. వారు ఎప్పుడూ నెగిటివ్ వార్తలు, నెగిటివ్ విషయాలను నమ్ముతారు. నసీర్ భాయ్కి ఏది ఇష్టమో నాకు తెలియదు. నేను అతని నటనకు అభిమానిని. అతడికి 'ది తాష్కెంట్ ఫైల్స్'లో కూడా నటించినప్పుడు చూసాను. కానీ ఆలస్యంగా అతను ఈ రకమైన విషయాలు చెప్పాడు. బహుశా అతను చాలా పెద్దవాడయ్యాడు లేదా అతను జీవితంలో చాలా నిరాశకు గురయ్యాడు'' అని వ్యాఖ్యానించారు.
అలాగే “కాశ్మీర్ ఫైల్స్తో అతని సమస్య ఏమిటో నాకు తెలియదు. కాశ్మీర్లో కాశ్మీరీ హిందువులపై మారణహోమం జరగలేదని అతను చెబితే, అతను మారణహోమాన్ని ఎందుకు కప్పిపుచ్చాలనుకుంటున్నాడో నాకు అర్థం కాదు. అతడు తెలివైన వ్యక్తి. అతడు నరమేధాన్ని తిరస్కరించేవాడు కాదు. నిజంగా అతను మారణహోమ నిరాకరణి అయితే నాకు చెప్పడానికి మాటలు లేవు” అని వివేక్ వ్యంగ్యంగా అన్నారు.
వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇప్పుడు తన కొత్త చిత్రం 'ది వ్యాక్సిన్ వార్' రిలీజ్ కు రెడీగా ఉంది. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. మనం జీవిస్తున్న కాలంలోని కొన్ని వాస్తవాలను బయటకు తీసుకురావడానికి ఈ సినిమా సిద్ధంగా ఉందని అగ్నిహోత్రి వెల్లడించారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశం సాగించిన పోరాటం నేపథ్యంలో ప్రాణాంతక వైరస్కు వ్యాక్సిన్ను తయారు చేయడానికి భారతీయ వైద్య విభాగం పనిచేసిన విధానం ఆధారంగా 'ది వ్యాక్సిన్ వార్' చిత్రం రూపొందింది. ఇందులో నానా పటేకర్, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, రైమా సేన్, సప్తమి గౌడ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే
