Chiranjeevi_vishwambhara: చిరంజీవి `విశ్వంభర` మూవీ రిలీజ్‌ డేట్‌కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. మరోసారి ఈ మూవీ వాయిదా పడుతుందట. మరి కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు?  

Chiranjeevi_vishwambhara: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీని సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

`విశ్వంభర` మూవీ మరోసారి వాయిదా?

సినిమా ఈ ఏడాది సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తుంది. షూటింగ్‌ డిలే, ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్ విషయంలో డిలే కారణంగా మూవీ వాయిదా పడుతూ వస్తుంది. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీని ఏప్రిల్‌, మేలో విడుదల చేయాలని టీమ్‌ భావించింది. కానీ ఇప్పుడు మరో అప్‌ డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ ఈ సమ్మర్‌లో రావడం లేదట. మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తుంది. మరో రెండు మూడు నెలలు పోస్ట్ పోన్‌ అవుతుందట. 

చిరంజీవి `విశ్వంభర` కొత్త రిలీజ్‌ డేట్‌?

ఇప్పుడు కొత్త రిలీజ్‌ డేట్‌ వినిపిస్తుంది. ఆగస్ట్ లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే డిలేకి కారణం వీఎఫ్‌ఎక్స్ అని తెలుస్తుంది. గతంలో ఓ కంపెనీకి ఇవ్వగా అవి సరిగా రాలేదని, దీంతో కంపెనీ మార్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ సీజీ, వీఎఫ్‌ఎక్స్ వర్క్ విసయంలోనే ఆలస్యం అవుతుందట. అందుకే మరోసారి వాయిదా వేసే ఆలోచనలో టీమ్‌ ఉన్నట్టు తెలుస్తుంది. 

`విశ్వంభర` వీఎఫ్‌ఎక్స్ విసయంలో రాజీపడని చిరంజీవి

ఆ మధ్య `విశ్వంభర` టీజర్‌ వచ్చింది. వీఎఫ్‌ఎక్స్ విసయంలో విమర్శలు వచ్చాయి. చాలా ట్రోల్స్ నడిచాయి. ఓటీటీల పుణ్యామా అని ఆడియెన్స్ ప్రపంచ సినిమాని చూస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ పరంగా చాలా క్వాలిటీ మూవీస్‌ చూస్తున్నారు. దీంతో వాటితో పోలిక ఉంటుంది. తగ్గిందా విమర్శలు తప్పడం లేదు. అందుకే చిరంజీవి ఆ విషయంలో తగ్గడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే `విశ్వంభర` మరోసారి వాయిదా పడుతుందని తెలుస్తుంది. 

ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటిస్తుంది. `స్ఠాలిన్‌` తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నారు. వీరితోపాటు ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్‌ వంటి హీరోయిన్ల కనిపిస్తారని తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతుంది.

`జగదేక వీరుడు అతిలోక సుందరి` తరహాలోనే సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ విషయంలో నాగ్‌ అశ్విన్‌, వినాయక్‌ వంటి దర్శకలు సలహాలు, సపోర్ట్ అందిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని చిరంజీవి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 

read  more: First Salary: రామ్‌ చరణ్‌ ఫస్ట్ రెమ్యూనరేషన్‌ ఏం చేశాడో తెలుసా? చిరంజీవి కూడా షాక్‌ అయిన సందర్భం

also read: ఒకే రోజు 9 సినిమాలు ఓపెనింగ్‌ చేసుకున్న సెన్సేషనల్‌ స్టార్‌ ఎవరో తెలుసా? తారకరత్న కాదు.. అప్పట్లో ఆయనో సునామీ