Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోకి రజినీకాంత్ సర్ప్రైజ్ ఫోన్ కాల్!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో విష్ణు విశాల్ కి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేయడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం 'రత్ససన్'.  రామ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల కాస్త సమయం దొరకడంతో రజినీకాంత్ తన మనవరాళ్లతో కలిసి  పలు సినిమాలను వీక్షించారట.

vishnu vishal tweet on rajinikanth
Author
Hyderabad, First Published Oct 24, 2018, 11:41 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో విష్ణు విశాల్ కి ఫోన్ చేసి సర్ప్రైజ్ చేయడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం 'రత్ససన్'. 
రామ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఇటీవల కాస్త సమయం దొరకడంతో రజినీకాంత్ తన మనవరాళ్లతో కలిసి పలు సినిమాలను వీక్షించారట. ఈ క్రమంలో విష్ణు విశాల్ నటించిన 'రత్ససన్' సినిమా కూడా చూశారట. సైకో థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా రజినీకాంత్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో విష్ణు విశాల్ కి ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా వెల్లడించారు. ''ఒకే ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేసి సర్ప్రైజ్ చేసినప్పుడు సంతోషంతో గెంతులేశా.. 'రత్ససన్' అధ్బుతంగా ఉంది, పోలీసు యూనిఫాంలో ఫిట్ గా ఉన్నావు, చక్కటి హావభావాల్ని పలికించావు. నీతో దర్శకుడు కాంబినేషన్ బాగుంది'' అని చెప్పారు అంటూ విష్ణు విశాల్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం రజినీకాంత్ 'పేటా' సినిమాలో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజ్ నటిస్తోన్న ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న విడుదల కానుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios