నేడు అనుష్క శర్మ నటించిన చిత్రం సూయీ ధాగా’ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగానే విరాట్ సినిమా స్పెషల్ షో ను వీక్షించాడు. రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి రెండవసారి కూడా చూశాడు. అయితే సినిమాకు తనదైన శైలిలో రివ్యూ కూడా ఇచ్చాడు. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తరువాత రెస్ట్ దొరకడంతో సమయాన్ని ఏ మాత్రం వృధా చేయకుండా తన భార్య అనుష్క శర్మతో గడుపుతున్నాడు. ఆమెతో పాటు షూటింగ్ స్పాట్ లకు కూడా వెళుతూ కొత్త ప్రపంచంలో ఆనందంగా గడుపుతున్నాడు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే నేడు అనుష్క శర్మ నటించిన చిత్రం సూయీ ధాగా’ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అందరికంటే ముందుగానే విరాట్ సినిమా స్పెషల్ షో ను వీక్షించాడు. రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖులతో కలిసి రెండవసారి కూడా చూశాడు. అయితే సినిమాకు తనదైన శైలిలో రివ్యూ కూడా ఇచ్చాడు. 

"గురువారం సుయీ ధాగా’ మూవీ చూడగానే ఎంతగానో నచ్చింది. రెండవసారి చూసినప్పుడు మరింత నచ్చింది. ఎమోషన్ ఉన్న ఒక రోలర్ కోస్టర్ లాంటి సినిమా. అందరూ చాలా బాగా నటించారు. మౌజీ(వరుణ్‌ ధావన్‌) యాక్టింగ్ సూపర్బ్. అనుష్క పాత్ర మమత మనసును దోచేసుకుంది. నిదానమైన పాత్ర అయినప్పటికీ పవర్ఫుల్ తో పాటు ప్రతిభ కనిపిస్తోంది. మనసును దోచేసుకుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. నా అనుష్క గర్వపడేలా చేసింది. సినిమాను మిస్ కాకండి" అంటూ విరాట్ సోషల్ మీడియా ద్వారా తన వివరణ ఇచ్చాడు.