Asianet News TeluguAsianet News Telugu

కంగనాని 'తలైవి'లో నటించవద్దని చెప్పిన విజయేంద్ర ప్రసాద్!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించే చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే కంగనా రనౌత్ ఎంచుకుంటోంది. తాజాగా కంగనా నటించిన మరో చిత్రం 'తలైవి'.

Vijayendra Prasad interesting comments on Kangana ranaut
Author
Hyderabad, First Published Sep 6, 2021, 5:03 PM IST

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించే చిత్రాలు విభిన్నంగా ఉంటాయి. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే కంగనా రనౌత్ ఎంచుకుంటోంది. తాజాగా కంగనా నటించిన మరో చిత్రం 'తలైవి'. ఇది డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పాలి. తలైవి మూవీ ప్రస్తుతం సౌత్ లో టాక్ ఆఫ్ గా మారింది. 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్ర పోషించడం అంటే డేరింగ్ అటెంప్టే. కానీ జయలలిత పాత్ర కంగనాకు బాగా సూట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించారు. ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో తలైవి చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఈ చిత్రానికి కంగనా పేరు సిఫార్సు చేసింది నేనే. కానీ కంగనాతో ఈ మూవీలో నటించవద్దు అని చెప్పాను. కంగనా తనకు జయలలిత మేడం తెలుసు కానీ తమిళనాడు పాలిటిక్స్, బ్యాక్ స్టోరీ గురించి నాకేమి తెలియదు అని చెప్పింది. 

దీనితో ఈ చిత్రం నువ్వు నటించవద్దు.. నువ్వు నీలా ఉండు చాలు అని చెప్పాను. జయలలిత పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ అయితే.. కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. కంగనా తప్పకుండా ఒక రోజు టాప్ చైర్ దక్కించుకుంటుంది అం విజయేంద్ర ప్రసాద్ అన్నారు. 

ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. హైదరాబాద్ లో కేవలం కొద్దిమంది సెలబ్రిటీలకు ఈ చిత్ర స్పెషల్ షో వేశారట. కంగనా, అరవింద్ స్వామి అదరగొట్టేసినట్లు టాక్. సెప్టెంబర్ 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఏ ఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు.  

Follow Us:
Download App:
  • android
  • ios