కరోనాతో పోరాటంలో.. సీఎం నిధికి `ఉప్పెన` స్టార్ విజయ్ సేతుపతి సహాయం..
`ఉప్పెన` ఫేమ్ విజయ్ సేతుపతి తమిళనాడు సీఎం నిధికి రూ. 25లక్షలు డొనేట్ చేశారు. మంగళవారం ఆ అమౌంట్కి సంబంధించిన చెక్ని సెక్రెటరీలోని సీఎంని కలిసి అందజేశారు.
`మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతి గొప్ప మనసుని చాటుకున్నారు. కరోనా కష్టకాలంలో తనవంతుగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన తమిళనాడు సీఎం నిధికి రూ. 25లక్షలు డొనేట్ చేశారు. మంగళవారం ఆ అమౌంట్కి సంబంధించిన చెక్ని సెక్రెటరీలోని సీఎంని కలిసి అందజేశారు. కరోనాతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుండాలనే ఉద్దేశంతో తనవంతు సహాయం చేసినట్టు తెలిపారు.
గతంలో తమిళనాడు సీఎం నిధికి సూర్య, కార్తీ, శివకుమార్ ఫ్యామిలీ, రజనీకాంత్ కూతురు, శంకర్, మురుగదాస్, అజిత్, ఉదయ్నిధి స్టాలిన్, విక్రమ్, శివకార్తికేయన్, వెట్రిమారన్ వంటి సినీ ప్రముఖులు సీఎం నిధికి తమ వంతు విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. తాజాగా విజయ్ సేతుపతి ముందుకొచ్చాడు.
ఇక విజయ్ సేతుపతి `ఉప్పెన` సినిమాలో నెగటివ్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. సినిమాకి జీవం పోశారు. అంతకుముందు `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. అలాగే తమిళంలో చివరగా విజయ్తో కలిసి `మాస్టర్` చిత్రంలో నటించారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో 14 సినిమాలున్నాయి. అందులో ఒకటి మలయాళం, మరోటి హిందీ సినిమా కావడం విశేషం. దీంతోపాటు కొత్తగా కళైపులి ఎస్ థాను ప్రొడక్షన్లో రెండు సినిమాలకు అగ్రీమెంట్ చేసుకున్నారు.