గొప్ప వ్యక్తులను విజయాలు, పరాజయాలతో జడ్జ్ చేయలేము. కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధేస్తుంది. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడం కరక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు.

రీసెంట్ గా చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రం "భోళా శంకర్". ఈ  ఫ్లాప్ గురించి తనదైన రీతిలో స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు విజయ్ దేవరకొండ.  తన తాజా చిత్రం 'ఖుషీ' సినిమా ప్రచారంలో భాగంగా ఆ సినిమా హీరో  విజయ్ దేవరుకొండ తెలుగులోనే కాకుండా మిగతా ప్రాంతాలు కూడా పర్యటిస్తున్నాడు. ఆలా వెళ్ళినప్పుడు తాజాగా అతను మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి, రజినీకాంత్ ల మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

 సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నై వెళ్లారు హీరో విజయ్ దేవరకొండ. ఇందులో భాగంగా ప్రెస్ మీట్ పాల్గొన్న ఆయన   చిరంజీవి గురించి కూడా చెప్పుకొచ్చారు. విజయ్ మాట్లాడుతూ..  చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం.  ఒక మంచి దర్శకుడు పడితే ఆయనలో ఉన్న ఎనర్జీ ని బయటకి తీసుకువచ్చి  చేయిస్తే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర 'వాల్తేరు వీరయ్య' #WaltairVeerayya లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆయన ఒక ఎవరెస్టు. తెలుగు ఇండస్ట్రీలో చాల మార్పులు తీసుకొచ్చారు. ఆయన సాధించిన విజయాలు నాలాంటో లక్షల మందికి స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తులను విజయాలు, పరాజయాలతో జడ్జ్ చేయలేము. కానీ కొంతమంది చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే బాధేస్తుంది. కనీసం గౌరవం కూడా లేకుండా మాట్లాడం కరక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చారు. 

అలాగే చిరంజీవి, రజినీకాంత్ లాంటివాళ్ళకి ఇలాంటి అపజయాలు వరసగా ఆరేడు వచ్చినా వాళ్ళు మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర తమ ప్రతాపం చూపిస్తారని చెప్పాడు. వాళ్ళకి ఇవేమీ కొత్త కావు. రజినీకాంత్ వరసగా ఆరు ప్లాప్ లు ఇచ్చినా, 'జైలర్' #Jailer అనే సినిమాతో ఈరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.500 కోట్లు కలెక్టు చేసే హిట్ ఇచ్చారని, అందుకని వాళ్ళకి హిట్, ఫ్లాప్ ఇలాంటివి ఏవీ ఉండవని అన్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.