Asianet News TeluguAsianet News Telugu

శ్రీదేవితో నా అనుబంధం అలాంటిది-వెంకీ

  • శ్రీదేవితో అనుబంధాన్ని నెమరువేసుకున్న వెంకీ
  • క్షణక్షణం చిత్రంలో నటించిన శ్రీదేవి, వెంకీ
  • అంత్యక్రియల తర్వాత అప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్ వెంకీ
victory venkatesh recollects memories with sridevi

అతిలోక సుందరి శ్రీదేవి కోట్లాదిమంది అభిమానులను విడిచి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది. ఆమె నటించిన చిత్రాలు, జ్ఞాపకాలు మాత్రం సినిమా ఉన్నన్ని రోజులు ఉంటాయి. శ్రీదేవి అంత్యక్రియలకు హాజరై ముంబై నుంచి  తిరిగి వచ్చిన తరువాత విక్టరీ వెంకటేష్ శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

 

శ్రీదేవి తెలుగులో అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాతి తరం హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జునలతో కూడా శ్రీదేవి నటించి తెలుగు వెండి తెరపై శ్రీదేవి సోయగం, నటన తెలుగువారు ఎప్పటికి మరచిపోకుండా చేసింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో దేవకన్యగా శ్రీదేవి రూపం, తన నటన వర్ణనాతీతం.

 

జగదేకవీరుడు అతిలోక సుందరి తరువాత శ్రీదేవి విక్టరీ వెంకటేష్ క్షణక్షణం చిత్రంలో నటించి మెప్పించింది. ఈ మూవీతో శ్రీదేవితో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో శ్రీదేవి మరణ వార్త తెలుసుకుని వెంకీ దిగ్బ్రాంతికి లోనయ్యారు. ముంబై వెళ్లి ఆమె అంత్య క్రియల్లో పాల్గొన్నారు. తిరిగి వచ్చాక శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు.

 

తమ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడే శ్రీదేవి గురించి విన్నానని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా శ్రీదేవి సినిమాల్లోకి వచ్చినప్పుడే ఆమె గురించి తెలుసుకున్నా అని వెంకీ అన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవి చాలా బాగా చేస్తోంది అని అంతా అనేవాళ్ళు. శ్రీదేవి సినిమా జర్నీ మోస్ట్ రేర్ అని వెంకీ అన్నారు. శ్రీదేవి లాంటి వాళ్ళని చూస్తే వారు సినిమా కోసమే పుట్టారని అనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయం సాధించారు. అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు. శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులతో నటించారు. ఆ తరువాత మా తరం నటులతో కూడా నటించారు అని వెంకీ తెలిపాడు. వెళ్లిన ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. అదే శ్రీదేవి ప్రత్యేకత అని వెంకీ అన్నారు.

 

క్షణ క్షణం చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ అనగానే మేమంతా చాలా ఎగ్జైట్ అయ్యాం అని వెంకీ అన్నారు. నటనలో శ్రీదేవి అప్పటికే నా కన్నా చాలా సీనియర్. క్షణ క్షణం చిత్ర క్లైమాక్స్ గమ్మత్తుగా ఉంటుంది. ట్రైన్ సన్నివేశాల్లో నేను పడిపోతే ఆమె చేయి ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంటుంది. మేమిద్దరం చాలా బాగా నటించాం. కొన్ని అద్భుతమైన భావాల్ని మా నుంచి రాంగోపాల్ వర్మ రాబట్టారు. జామురాతిరి జాబిలమ్మ సాంగ్ ఓ క్లాసిక్. సాంగ్ మొత్తం నేను, శ్రీదేవి కూర్చునే హావ భావాల్ని పలికించాం అని వెంకీ అన్నారు. హీరో హీరోయిన్లు కూర్చుని సాంగ్ మొత్తం చేయడం మరెక్కడ జరగలేదు అని వెంకీ అన్నారు. శ్రీదేవి నా ఎక్స్ ప్రెషన్స్ ని గమనించే వారు, నేను ఆమె ఎక్స్ ప్రెషన్స్ ని గమనించే వాడిని. ఆ సాంగ్ మా ఇద్దరికీ మధురమైన అనుభవం అని వెంకీ అన్నారు.

 

మా నాన్న రామానాయుడు గారికి ఫెవరెట్ ఆర్టిస్ట్ శ్రీదేవి. ఆమె చూపించే డెడికేషన్ గురించి ఆయన ప్రశంసించే వారు. సురేష్ ప్రొడక్షన్స్ లో శ్రీదేవి ముందడుగు, తోఫా వంటి చిత్రాల్లో నటించారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే చాలా షాక్ కి గురయ్యా అని వెంకీ తెలిపాడు. వెంటనే ముంబై వెళ్లి వారి కుటుంబానికి అండగా ఉండాలని అనిపించింది. నాకు, అన్నయ్యకు బోనికపూర్, అనిల్ కపూర్ చాలా సన్నిహితులు అంటూ తన జ్ఞాపకాలు నెమరు వేసుకొన్నారు వెంకీ.

Follow Us:
Download App:
  • android
  • ios