సారాంశం
మరోసారి వార్తల్లో నిలిచింది వనితా విజయ్ కుమార్. తన మూడో భర్త చనిపోయాడనే వార్త కారణంగా ఇప్పుడు ఆమె చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించారు. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
వివాదాస్పద సంచలన నటిగా పేరుతెచ్చుకున్న వనితా విజయ్ కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె పెళ్లిళ్ల వార్తలే ఎక్కువగా వస్తుంటాయి. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది వనితా విజయ్ కుమార్. తన మూడో భర్త చనిపోయాడనే వార్త కారణంగా ఇప్పుడు ఆమె చర్చనీయాంశంగా మారింది. వనితా.. మూడో భర్త అంటూ ప్రచారం జరిగిన పీటర్ పాల్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్ ఛానెళ్లు, పేపర్లు, సైట్స్ వార్తలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై వనితా విజయ్ కుమార్ స్పందించారు.
ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో వనిత చెబుతూ, పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా అనే కన్ఫ్యూజన్లో ఓపిక పట్టాను. నన్ను ఓపికగా ఉండనివ్వ లేదు. కానీ అన్ని మీడియా సంస్థలపై ఉన్న గౌరవంతో ఓ విషయం గుర్తు చేయాలనుకుంటున్నానని, పీటర్ పాల్తో తనకు న్యాయబద్ధంగా పెళ్లి జరగలేదని వెల్లడించింది. 2020లో కొన్ని రోజులపాటు తాము రిలేషన్షిప్లో ఉన్నామని, అది ఆ సంవత్సరమే ముగిసిందని, తాను ఆయన భార్యని కాదని, అతను తన భర్త కాదని స్పష్టం చేసింది.
`వనిత విజయ్ కుమార్ భర్త చనిపోయాడు` అంటూ రాస్తున్న వార్తలను ఆపేయాలని కోరింది. తనకు భర్త లేడని, ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నట్టు చెప్పింది. ఏ విషయానికి నేను బాధపడటం లేదని, ఇప్పుడు సంతోషంగా ఉన్నానని, అందరికి ఇదే తన విన్నపం అంటూ మిస్ వనిత విజయ్ కుమార్ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది వనిత విజయ్ కుమార్.
ఇదిలా ఉంటే పీటర్ పాల్ చనిపోయినప్పుడు ఆమె స్పందిస్తూ, `ఎవరి సాయం లేకుండా ఉండేవారికి దేవుడే సాయం చేస్తాడని నాకు మా అమ్మ చెప్పింది. నిజంగా ఇదొక గుణపాఠం. అందరూ చూసి నేర్చుకోవాలి. దిక్కుతోచని స్థితిలో ఎవరికి వారు తమ సొంత దారిని ఎంచుకోవాలి. ఇప్పుడు వెళ్తున్న కొత్త చోట అయినా నువ్వు ప్రశాంతంగా బతకాలి` అంటూ పేర్కొంది వనిత. అయితే వనితకి అంతకంటే ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. వారితో విడిపోయింది. 2020లో పీటర్ని పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ తర్వాత విడిపోయినట్టు కూడా ఆమె పోస్ట్ పెట్టింది.
వనిత విజయ్ కుమార్.. సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజుల ల కుమార్తె అనే విషయం తెలిసిందే. తరచూ ఆమె వివాదాస్పద విషయాల్లో వార్తల్లో నిలుస్తుంది. అయితే మూడు పెళ్లిళ్ల తర్వాత మ్యారేజ్ లైఫ్పై విసిగిపోయిన వనిత ప్రస్తుతం ఒంటరిగానే ఉంటుంది. మళ్లీ కెరీర్పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటిస్తున్న `మళ్లీ పెళ్లి` చిత్రంలో నటిస్తుంది. ఇందులో నరేష్కి రెండో భార్య పాత్రలో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో `దేవి` చిత్రంలోనూ వనిత మెరిశారు.