`ఉస్తాద్ భగత్ సింగ్` కొత్త టీజర్.. పవన్ కళ్యాణ్ `జనసేన` పార్టీ ఎన్నికల ప్రచార వీడియో ?
పవన్ కళ్యాణ్ నటిస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి ఊహించని సర్ప్రైజ్ వచ్చింది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో దాన్ని తలపించే టీజర్ని విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా రాజకీయ ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఏపీతోపాటు పార్టమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో పవన్ మరింత బిజీ అయ్యాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాలను తన రాజకీయ ప్రచారంగా వాడుకుంటున్నారు. ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన ప్రచార వీడియో విడుదల చేశారు. సినిమా ప్రోమో స్టయిల్లో దాన్ని డిజైన్ చేశారు. అది అదరగొట్టింది.
Polling: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా నుంచి సర్ప్రైజ్ ట్రీట్ వచ్చింది. రెండు రోజులుగా దీనికి సంబంధించిన ట్రీట్ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శకుడు హరీష్ సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతుందన్నారు. `భగత్ బ్లేజ్` పేరుతో దీన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఆ సరికొత్త టీజర్ విడుదలయ్యింది.
ఇందులో జాతరలో ఓ వైపు ప్రత్యర్థుల వేట సాగుతుంది, మరోవైపు భారీగా జాతర జరుగుతుంటుంది. ఈ క్రమంలో ప్రత్యర్థులు వెంటపడుతుంటారు. కట్ చేస్తే విలన్ నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్ని కింద పడేసి పగల గొట్టాడు. దీంతో రెచ్చిపోయిన పవన్ అతని భరతం పడతాడు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. తనదైన యాక్షన్తో రెచ్చిపోయాడు. అందరికి వార్నింగ్ ఇచ్చి హల్చల్ చేశాడు. అదే జాతరలో విలన్ల అంతు చూస్తాడు. తనదైన మ్యానరిజం, యాక్షన్, స్టయిల్తో రెచ్చిపోయాడు.
అనంతరం పగిలిన గాజు ముక్కని తీసుకుని `గ్లాస్ పగిలే కొద్ది పదునెక్కుతుంది`. చివర్లో `కచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. కనిపించని సైన్యం` అంటూ మరోసారి పవన్ యాక్షన్తో రచ్చ చేశాడు. ఈ `ఉస్తాద్ భగత్ సింగ్` కొత్త టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కానీ ఇది పూర్తిగా జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వీడియోగా అనిపిస్తుంది. జాతలో ఇనుప సువ్వకి జనసేన కండువా చుట్టి ఉంది. చివర్లో గ్లాస్ గురించి చర్చ జరిపారు. గ్లాస్ ప్రత్యేకతని చెప్పాడు పవన్. ఇలా చూస్తే ఇది పూర్తిగా జనసేన ఎన్నికల ప్రచారం చిత్రంగానే నిలుస్తుందని చెప్పొచ్చు.
ఇక ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. `గబ్బర్ సింగ్` తర్వాత పవన్, హరీష్ ల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.