ఓటీటీలో ‘ఉప్పెన’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఉప్పెన సినిమా ను గతంలోనే నెట్ ఫ్లిక్స్ వారికి అమ్మేయడం జరిగింది. వారు నిర్మాతలతో ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదల అయిన 50 రోజులకు స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యారు.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము రేపింది. లాక్ డౌన్ తర్వాత బిగ్గెస్ట్ చిత్రంగా ఇప్పటి వరకు ఉప్పెన నిలిచింది. ఈ ఏడాది టాప్ చిత్రాల జాబితాలో కూడా ఉప్పెన ఉంది. అలాంటి ఉప్పెన సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇచ్చేసారు.
ఉప్పెన సినిమా ను గతంలోనే నెట్ ఫ్లిక్స్ వారికి అమ్మేయడం జరిగింది. వారు నిర్మాతలతో ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదల అయిన 50 రోజులకు స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యారు. ఉప్పెన సినిమా ను ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉప్పెన సినిమా క్రేజ్ బజ్ అలాగే ఉంది. కనుక సినిమా తప్పకుండా ఓటీటీలో కూడా భారీ వ్యూస్ ను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, శ్రీమణి రాసిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టించింది. ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తోంది.
ఇక తమకు కలెక్షన్ల వర్షం కురిపించే సినిమా తీసినందుకు గాను.. సదరు చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' ఒక బెంజ్ కారును బుచ్చిబాబుకు కానుకగా పంపించింది. ఆ కారు విలువ దాదాపు రూ.75లక్షలు ఉంటుందని అంచనా. ఈ మేరకు నిర్మాతలు నవీన్, రవిశంకర్ స్వయంగా బుచ్చిబాబుకు కారు అందజేసి అభినందించారు.