Asianet News TeluguAsianet News Telugu

'మిషన్ మంగళ్' మూవీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రివ్యూ!

యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మిషన్ మంగళ్' స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అక్షయ్ కుమార్ తో పాటు సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, తాప్సి, నిత్యామీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

 

Union minister Kishan Reddy response after watching Mission Mangal movie
Author
Hyderabad, First Published Aug 14, 2019, 8:57 PM IST

యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మిషన్ మంగళ్' స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అక్షయ్ కుమార్ తో పాటు సోనాక్షి సిన్హా, విద్యాబాలన్, తాప్సి, నిత్యామీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. 

ఈ చిత్ర స్పెషల్ షోని సెలెబ్రిటీల కోసం ఢిల్లీలో ప్రదర్శించారు. ఇస్రో చేపట్టిన మార్స్ మిషన్ ప్రాజెక్టు నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ బిజెపి నేత, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా మిషన్ మంగళ్ చిత్రాన్ని వీక్షించారు. 

అనంతరం ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని పంచుకున్నారు. మిషన్ మంగళ్ చిత్ర ప్రీవ్యూ చూశా. సినిమా చాలా బావుంది. అద్భుతంగా తెరకెక్కించారు. ఇస్రో ఖ్యాతిని, మార్స్ మిషన్ ప్రాజెక్టు లో వారి కష్టాన్ని ఈ చిత్రాల్లో వర్ణించారు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

అక్షయ్ కుమార్ తో పాటు మిషన్ మంగళ్ చిత్ర యూనిట్ తో ఉన్న ఫోటోలని కిషన్ రెడ్డి షేర్ చేశారు. ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios