పవన్ కల్యాణ్ మాస్క్ వివాదం: జగన్ పై కామెంట్లు, వైసీపీ కౌంటర్లు
ఇంటర్వ్యూలో పవన్ చెప్పిన విషయాలు ప్రక్కన పెడితే, ఆయన పెట్టుకున్న ధరించిన మాస్క్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ మాస్క్ మీద 'Specially Designed For PK'అని రాసి ఉంది. ఈ మాస్క్ ని పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారట.. ఈ మాస్క్ ముక్కు, నోరును పూర్తిగా కవర్ చేసేలా ఉంది. ప్రస్తుతం పవన్ ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ మాస్క్ విషయంలో వైకాపా-జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య వివాదం మొదలైంది.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ తర్వాత బయిట పెద్దగా కనిపించలేదు. ఎప్పటికప్పుడూ కరోనా పైన అవగాహన,తాజా రాజకీయ పరిస్థితుల పైన అయన సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా అయన జనసేన సైనికుల మేరకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వూలో సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించే ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ చెప్పిన విషయాలు ప్రక్కన పెడితే, ఆయన పెట్టుకున్న ధరించిన మాస్క్ పైన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఆ మాస్క్ మీద 'Specially Designed For PK'అని రాసి ఉంది.
ఈ మాస్క్ ని పవన్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారట.. ఈ మాస్క్ ముక్కు, నోరును పూర్తిగా కవర్ చేసేలా ఉంది. ప్రస్తుతం పవన్ ధరించిన మాస్క్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఈ మాస్క్ విషయంలో వైకాపా-జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య వివాదం మొదలైంది.
ఈ మాస్క్ ని షేర్ చేస్తూ...ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి...ఈ కరోనా టైమ్ లో ఎలాంటి మాస్క్ వేసుకోకుండా బయటకు వచ్చారని..మా నేత పవన్ మాత్రం నిబంధలను తూచ తప్పకుండా పాటిస్తున్నారని ట్వీట్లు చేయటం మొదలెట్టారు. ఇది వైకాపా అభిమామానులకు కాలింది. వారు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా ఉండే గవర్నర్ గారు, ముఖ్యమంత్రిగారు సామాన్యుల్లా పది రూపాయల విలువ గల మాస్క్ ని ధరించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖరీదైన మాస్క్ ని…దానిపై పీకే అని మళ్లీ పేరును రాసుకుని సినిమా స్టైల్లో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేయటం మొదలెట్టారు. దీంతో జనసేన కార్యకర్తలు మండిపడటం మొదలెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ని తగ్గించాలనే ముఖ్యమంత్రి మాస్క్ పెట్టుకోలేదంటూ రేపు వైకాపా వాళ్లు చెప్పినా చెప్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఇక రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది .ఇది హిందీలో వచ్చిన పింక్ సినిమాకి రీమేక్.. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేదా థామస్, అనన్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.