Guppedantha Mansu Serial Today: శైలేంద్రపై ఎటాక్, ఒక్క సీన్ తో కథను అడ్డం తిప్పేశారుగా..!
ఆ తర్వాత వెంటనే మహేంద్ర కూడా ఫోన్ చేస్తాడు. ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసినా తాను ప్రమాదంలో పడతానని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ధరణి అక్కడికి స్వీట్లు తీసుకొని వస్తుంది. ధరణి ముందు ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు నాటకం ఆడతాడు.
![Guppedantha Mansu Serial Today 1st December 2023 Devayani is puzzled ram Guppedantha Mansu Serial Today 1st December 2023 Devayani is puzzled ram](https://static-ai.asianetnews.com/images/01hghpzgymmxad1ja95b9nympm/1gup18-jpg_363x203xt.jpg)
Guppedantha Mansu Serial Today: శైలేంద్రే అసలు హంతకుడు అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు. శైలేంద్ర కిల్లర్ తో మాట్లాడిన ఆడియోని భూషణ్ కుటుంబానికి వినిపిస్తాడు. అది విని అందరూ షాకౌతారు. దేవయాణి మాత్రం ఆ గొంతు తన కొడుకుది కాదు అని, మార్ఫింగ్ చేశారు అని వాదిస్తుంది. ఎవరూ వినిపించుకోకపోవడంతో, రిషి దగ్గరకు వెళ్తుంది. ఇదంతా అబద్ధం అని చెప్పు రిషి అని అడుగుతుంది. రిషి మాత్రం ఆ షాక్ నుంచి కోలుకున్నట్లుగా అనిపించదు. ఆ షాక్ లో ఉండగానే దేవయాణి ఇలా బలవంతపెడుతూ ఉంటుంది. వాళ్ల పెద్దమ్మ మాటలకు రిషి ఎక్కడ కరిగిపోతాడా అని భయపడిన మహేంద్ర వెంటనే రిషి అని పిలుస్తాడు. అప్పుడే రిషి, తనకు కాసేపు సమయం కావాలి అని బయటకు వెళతాడు. రిషి ని తాను చూసుకుంటాను అని రిషి వెంటనే వసు కూడా వెళ్తుంది.
వెంటనే పోలీసు అధికారి ముకుల్.. శైలేంద్ర ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ధరణితో కలిసి బయటకు వెళ్లాడని, తానే పంపించానని ఫణీంద్ర చెబుతాడు. ఫోన్ చేసి రమ్మని చెప్పమని అంటాడు. మరోవైపు మహేంద్ర మనసులో రగిలిపోతూ ఉంటాడు. తమ అనుమానమే నిజమైందని, ఇక నువ్వు తప్పించుకోలేవు శైలేంద్ర అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పక్కకు వచ్చిన దేవయాణి తన కొడుక్కొ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఫణీంద్ర కూడా శైైలేంద్రకే ఫోన్ చేస్తూ ఉంటాడు. దేవయాణి ఫోన్ కలిస్తుంది. కానీ శైలేంద్ర లిఫ్ట్ చేయడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే, అప్పటికే తన ఫోన్ ని పోలీసులు ట్రాప్ చేస్తే, అసలు నిజం బయటపడుతుందని శైలేంద్ర అనుకుంటాడు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈ లోగా ఫణీంద్ర ఫోన్ చేసినా కూడా, శైలేంద్ర లిఫ్ట్ చేయకపోవడం గమనార్హం. అయితే, ముకుల్ తాను ఫోన్ చేస్తానని కాల్ చేస్తాడు. కొత్త నెంబర్ ముకుల్ ది అనే అనుమానంతో శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత వెంటనే మహేంద్ర కూడా ఫోన్ చేస్తాడు. ఎవరి ఫోన్ లిఫ్ట్ చేసినా తాను ప్రమాదంలో పడతానని శైలేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఈలోగా ధరణి అక్కడికి స్వీట్లు తీసుకొని వస్తుంది. ధరణి ముందు ఏమీ జరగనట్లు, ఏమీ తెలియనట్లు నాటకం ఆడతాడు.
రిషి చాలా ఆవేశంగా ఉంటాడు. అయితే, కూల్ డౌన్ అవ్వమని వసు చెబుతూ ఉంటుంది. అయితే, రిషి మాత్రం అది ‘అన్నయ్య వాయిసే కదా? ఇదంతా అన్నయ్య చేశాడా? నిజంగా అన్నయ్యే చేశాడా? ఇక్కడ జరుగుతుంది.. విన్నది అంతా నిజమేనా? నాకు అంతా అయోమయంగా ఉంది వసుధార’ అంటాడు. శైలేంద్ర అసలు రూపం తెలిసిన వసు.. మనసులో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది.‘ శైలేంద్ర గురించి తెలిస్తే మీరు తట్టుకోలేరు, నేను చెప్పినా మీరు నమ్మరు. అందుకే ఇంతకాలం నేను ఈ విషయం మీతో చెప్పలేదు. కానీ, ఎలాగైనా ఈరోజు అన్ని విషయాలు బయటకు రావాలి’ అనుకుంటుంది. రిషి మాత్రం శైలేంద్ర అలా చేస్తాడని నమ్మాడనికి మనసు అంగీకరించదు. తనను తన అన్నయ్య చాలా ప్రేమగా పిలిచేవాడని, అమ్మని నేను మేడమ్ అని పిలుస్తున్నా వద్దు అని అమ్మ అని పిలవమని చెప్పాడని గుర్తు చేసుకుంటాడు. అన్నయ్య వల్లే ఈ రోజు మనకు అమ్మ దూరం అయ్యిందా అని ఆలోచిస్తాడు. అయితే, అది నిజం అని ఒప్పుకోవడానికి రిషి మనసు అంగీకరించదు. అన్నయ్య అలా చెయ్యడని, ఆ అవసరం అన్నయ్యకు లేదని తెగ ఫీలైపోతాడు. తాను ఇప్పుడు ఏది నమ్మాలో అర్థం కావడం లేదని.. ఏది నిజం వసుధారా అని అడుగుతూ ఉంటాడు. వసు కూడా నిజం చెప్పేయాలని అని అనుకుంటుంది. కానీ, ఈ లోగా రిషిని ముకుల్ పిలుస్తాడు. దీంతో వసు నిజం చెప్పకముందే హాల్ లోకి వెళ్లిపోతారు.
ఎవరు ఫోన్ చేసినా శైలేంద్ర లిఫ్ట్ చేయడం లేదు అని ముకుల్ తో రిషి చెబుతాడు. అయితే, దేవయాణి ఫోన్ నుంచి కాల్ చేయమని అడుగుతారు. దేవయాణి అలా చేయడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది. అనుమానంతో దేవయాణి ఫోన్ ని ముకుల్ చెక్ చేస్తాడు. చాలా సార్లు ఫోన్ చేసినట్లు కనపడటంతో ఈ విషయమే అడుగుతాడు. తనను పిలుద్దామని అలా చేశాను అని చేశాను అని చెబుతాడు. ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే శైలేంద్రకు నిజం తెలిసిపోయిందని ముకుల్ అనుమానం వ్యక్తం చేశాడు. అందరి ఫోన్లు తీసుకొని హాల్ లో టేబుల్ మీద పెడతాడు.
శైలేంద్ర చేశాడు అంటే నమ్మలేకపోతున్నానని ఫణీంద్ర అంటాడు. కానీ, అదే నిజమని తెలిస్తే, మీరు జైల్లో వేయడానికి ముందే నేనే గొయ్యి తీసి పాతేస్తాను అని ఫణీంద్ర సీరియస్ గా అంటాడు. రిషి కూడా అన్నయ్య ఇదంతా చేశాడా పెదనాన్నా అని బాధగా అడుగుతాడు.వెంటనే వసుధార.. మీరు నమ్మినా నమ్మకపోయినా.. కనపడుతున్న సాక్ష్యాన్ని నమ్మాలి కదా అంటుంది. ఈ సాక్ష్యం కోసమే తాను ఇంతకాలం ఎదురు చూశానని మహేంద్ర మనసులో అనుకుంటాడు. అయితే, ముకుల్ మాత్రం పూర్తి విచారణ అయ్యేంత వరకు ఎదురుచూడాలని అంటాడు.
ఆ తర్వాత దేవయాణి ఫోన్ కి శైలేంద్ర కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది దేవయాణి. అయితే, ఆ ఫోన్ నుంచి ఎవరో మాట్లాడతారు. హాస్పిటల్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేసి, శైలేంద్ర అతని భార్యకు గాయాలు అయ్యాయని, ఆస్పత్రిలో ఉన్నారని చెబుతాడు. వెంటనే వీళ్లంతా ఆస్పత్రికి బయలుదేరతారు. వీళ్లంతా ఆస్పత్రికి వెళతారు. ధరణి చిన్నగాయంతో బాగానే ఉంటుంది. శైలేంద్ర మాత్రం గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అది చూసి దేవయాణి ఏడుస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో అర్థం కాక, ఇంట్లో వాళ్లంతా షాకై ఉంటారు. ఇక, దేవయాణి తన కొడుకును అలా చూసి సెంటిమెంట్ డైలాగులు కొడుతూ ఉంటుంది.
ఏం జరిగింది అని ధరణిని అడిగితే, ఎవరో ఎటాక్ చేశారు అని చెబుతుంది. ముగ్గురు రౌడీలు తాము ఇంట్లో ఉన్నప్పుడు తనను తోసేసి, శైలేంద్రను పొడిచేశారని చెబుతాడు. శైలేంద్రను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందని మహేంద్ర ప్రశ్నించగా అదే నాకు అర్థం కావడం లేదు అని ధరణి అంటుంది. ఆ రౌడీలు వెళ్లే సమయంలో ఇంట్లో వాళ్లను ఎవరినీ వదలము అని వార్నింగ్ ఇచ్చారని ధరణి చెబుతుంది. అయితే, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి శైలేంద్రే తన మీద తాను ఎటాక్ చేయించుకున్నాడనే విషయం చూసే ప్రేక్షకులకు అర్థమైపోయింది. దేవయాణి సమయం దొరికిందని ప్లేట్ తిప్పేస్తుంది. జగతి ని చంపినవాళ్లే శైలేంద్రను కూడా చంపాలని చూశారని అంటుంది.
ప్రేక్షకులు అందరూ శైలేంద్ర దొరికిపోయాడు అని సంబరపడేలోగా, డైరెక్టర్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లెక్కన ఇప్పట్లో శైలేంద్ర ఈ విషయంలో సేఫ్ అయినట్లే తెలుస్తోంది. మరి రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది.