జనాలకు సిగ్గు లేదు పనికిమాలినోళ్లు... శివాజీ హాట్ కామెంట్స్
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆయన ఏపీ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేస్తాడు.
![Bigg boss fame sivaji hot comments on ap politics ksr Bigg boss fame sivaji hot comments on ap politics ksr](https://static-ai.asianetnews.com/images/01hkabct8xqzjg48g79563c784/whatsapp-image-2024-01-04-at-18-22-44--1---1--jpeg_363x203xt.jpg)
శివాజీ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ చాలా కాలం క్రితమే యాక్టింగ్ కి దూరమయ్యారు. అయితే ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ పాల్గొన్నారు. కాగా బిగ్ బాస్ ద్వారా శివాజీ ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాడు. హౌస్ లో మైండ్ గేమ్ ఆడుతూ స్పా బ్యాచ్ కి చుక్కలు చూపించాడు. ప్రశాంత్, యావర్ లకు అండగా నిలుస్తూ వచ్చాడు.
దాదాపు విన్నర్ అవుతాడు అనుకున్న శివాజీ అనూహ్యంగా టాప్ 3 గా బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చిన శివాజీ వరుసగా యూట్యూబ్ ఛానల్స్ కి, పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని సంఘటనలు గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈయనకు రాజకీయాల గురించి కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి.
కాగా మీడియా అడిగే ప్రశ్నలకు శివాజీ జవాబిస్తూ చాలా ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఏపీ ప్రజలపై ఆయన మండిపడ్డారు. శివాజీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ' నా సమాధానం ఏంటంటే .. అసలు పాలిటిక్స్ గురించి అడగడం వేస్ట్ ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి మద్దతు ఇస్తూ ఉంటారు. వాళ్లంతా కలిసి నియోజకవర్గంలో మంచి అభ్యర్థి కావాలనుకుంటారు. ఈ రోజు ప్రజల కోసం 100 రూపాయలు పెడుతుంటారు. తర్వాత వారి నుంచి రెండు వందలు లాగేసుకుంటారు.
ప్రజల డబ్బులు గురించి రాజకీయ నాయకులు అసలు ఆలోచించరు. ప్రస్తుత సమాజం బాగోలేదు. ప్రభుత్వం బాగోలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్ళారా ' జనాలకు కాస్తయినా సిగ్గుండాలి. అంటూ శివాజీ ప్రజల ఆలోచనల పై సీరియస్ అయ్యారు. ఇది ఇలా ఉండగా .. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే శివాజీ ఓ వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం అది బాగా హిట్ అయింది. ఈటీవీ విన్ ఆప్ లో స్ట్రీమ్ అవుతూ కోట్ల వ్యూస్ ని కొల్లగొడుతుంది.