Asianet News TeluguAsianet News Telugu

మహేశ్ బాబు ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. ఆ స్పెషల్ డేన ‘ఎస్ఎస్ఎంబీ28’ నుంచి అప్డేట్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ మరోసారి కుదిరిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ బాబు అభిమానుల కోసం త్రివిక్రమ్ సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

Trivikram is planning a surprise for Mahesh Babu fans, that special day Update from SSMB28
Author
Hyderabad, First Published Jun 26, 2022, 2:57 PM IST

11 ఏండ్ల తర్వాత మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ మరోసారి సెట్ అవ్వడం ఫ్యాన్స్, ఆడియెన్స్ లో తెలియని జోష్ ను నింపింది.  ఎస్ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) వర్క్ టైటిల్ తో చిత్రం రూపొందుతోంది. ముచ్చటగా మూడోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుడటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు ‘అతడు, ఖలేజా’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. మహేశ్ ను  సరికొత్తగా చూపించిన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు కావడం విశేషం. 

దీంతో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’పై హైప్ నెలకొంది. గతేడాది ఆగస్టు 9న ఈ కాంబినేషన్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను  కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. దీంతో అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ28 నుంచి ఏదైనా అప్డైట్ ఇవ్వాలంటూ మహేశ్ ఫ్యాన్స్ మేర్స్ ను కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద అప్డేట్ ను మాత్రం ఇవ్వలేదు.  కానీ తాజా ఓ క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది.

మహేశ్ బాబు అభిమానుల కోసం త్రివిక్రమ్ సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా ఏడాదిగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం ‘ఎస్ఎస్ఎంబీ28’ నుంచి ఫస్ట్ లుక్ ను వదిలే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.  అయితే ఈ అప్డేట్ ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా  రానున్నందట. ఆ స్పెషల్ డేన తప్పకుండా ఫస్ట్ లుక్ తో పాటు మరీతర సాలిడ్ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

 త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘ssmb28’ వర్కింగ్‌ పేరుతో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని బ్యానర్ పై రూపొందిస్తున్నారు. నిర్మాతగా ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఎంపిక అయ్యారు.  కళా దర్శకునిగా  ఎ.ఎస్. ప్రకాష్ , కెమెరామెన్‌గా మధీని ఎంపికయ్యారు. హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios