'ధమాకా' డైరెక్టర్ నెక్స్ట్ టైటిల్ ..డిఫరెంట్ గా ఉందే
ఈ సినిమా స్క్రిప్టు పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలకు వినిపించబోతున్నారని, ఎవరు ఓకే చేస్తే వారితో ముందుకు వెళ్తారని అంటున్నారు.
![Trinadha Rao Nakkina next in his own banner jsp Trinadha Rao Nakkina next in his own banner jsp](https://static-ai.asianetnews.com/images/01hnsh1xs118e4g3xrvj49cbpd/nakkina-jpg_363x203xt.jpg)
రవితేజతో ధమాకా చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కు కామెడి,లవ్ సినిమాలపై మంచి పట్టు ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన గత చిత్రం ధమాకా 2022లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో నెక్ట్స్ ఏ హీరోతో ఈ దర్శకుడు చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో నాగశౌర్య సొంత బేనర్లో సినిమా చేయనున్నాడనే వార్త వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్తో త్రినాథరావు నక్కిన చేతులు కలిపారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంభందించిన అప్డేట్స్ ఏమీ లేదు. ఈ క్రమంలో మరో వార్త బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడు నక్కిన త్రినాధరావు తన సొంత బ్యానర్ త్రినాధరావు నక్కిన నేరేటివ్స్ అనే పేరుతో పెట్టుకుని ఓ సినిమా చేయటానికి రంగం సిద్దం చేస్తున్నారుట. ఈ మేరకు ఓ కథను రెడీ చేస్తున్నారని వినికిడి. అందుతున్న సమాచారం మేరకు #Anakapalli అనే సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్టు పూర్తైన తర్వాత ఇద్దరు హీరోలకు వినిపించబోతున్నారని, ఎవరు ఓకే చేస్తే వారితో ముందుకు వెళ్తారని అంటున్నారు.
త్రినాధ రావు నక్కిన రేంజ్ ను ధమాకా మరో లెవెల్ కు పెంచింది. అతని కెరీర్ లో ఇంతకుముందు సినిమా చూపిస్త మామ, నేను లోకల్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక త్రినాధ రావు మరో లెవల్ కు వెళ్లి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయాలి అని ఆలోచిస్తున్న తరుణంలో ధమాకా సినిమా అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు త్రినాధ రావుకు మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్రినాధరావు పూర్తి కథను సిద్ధం చేసుకున్న తర్వాత ఏ హీరో అయితే బాగుంటుందో ఆ హీరోకు చెప్పాలని అనుకుంటున్నాడట. మరి ఈ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడో చూడాలి.