ప్రేమికుల రోజున శ్రీదేవి వర్ధంతి.. ఆమెకి నచ్చిన స్థలంలోనే!
వెండితెరపై తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా చెరగని ముద్ర వేసింది. గతేడాది పెళ్లి కోసమని దుబాయ్ కి వెళ్లిన ఆమె హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది.
వెండితెరపై తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి.. సౌత్ తో పాటు నార్త్ లో కూడా చెరగని ముద్ర వేసింది. గతేడాది పెళ్లి కోసమని దుబాయ్ కి వెళ్లిన ఆమె హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది.
ఇప్పటికీ ఆమె మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరి 24, 2018లో ఆమె మరణించారు. తిథుల ప్రకారం ఆమె వర్ధంతి ఫిబ్రవరి 14న వచ్చిందని బోనీకపూర్ కుటుంబం తెలిపినట్లు సమాచారం. ఈ కార్యక్రమాలను శ్రీదేవికి నచ్చిన స్థలంలోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
శ్రీదేవికి చెన్నైలో తన ఇల్లు అంటే చాలా ఇష్టమట. కాబట్టి అక్కడే తొలి వర్ధంతిని జరపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆరోజు నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబంతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొనున్నారని సమాచారం.