టాలీవుడ్ యంగ్ స్టార్ శర్వానంద్ కు సర్జరీ జరగబోతోందా..? దానికోసం ఆయన అమెరికాకు వెళ్ళారా.. ఇంతకీ ఆయనకు ఏమైయ్యింది...? సర్జరీ దేనికి.. ? ఈ విషయంలో నిజం ఎంత..?
ఈమధ్య స్టార్ హీరోలకు ఎక్కువగా సర్జరీలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మోకాళ్లకు సర్జరీ జరిగినట్టు వార్తలు వైరల్ అవుతున్న క్రమంలో.. ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ స్టార్ కి కూడా సర్జరీ జరగబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ స్టార్స్ ఉన్నారు. కాని వారిలో కొంత మంది మాత్రమే సక్సస్ అయ్యి.. ప్రేక్షకుల ప్రేమను పొందారు.. అటువంటివారిలో శర్వానంద్ కూడా ఒకరు.
టాలీవుడ్ లో కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోయే హీరోలలో శర్వానంద్ ముందు ఉంటారు. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా. ఇన్నోసెంట్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు శర్వా. ఇక పోతే ఆయన ఎంత ప్రయత్నించినా... ఈమధ్య హిట్ లేకుండా పోతోంది. ఈమధ్యలో పెద్దగా సక్సెస్ సాధించని సినిమా కూడా లేదు. ఒకే ఒక జీవితం తప్పించి ఆయన సినిమాలన్నీ పోయినవేు. ఈక్రమంలో శర్వానంద్ కు సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే...?
రీసెంట్ గా పెళ్లి బంధంతో ఒక ఇంటివాడు అయ్యాడు శర్వానంద్. యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో శర్వా పెళ్లి జరిగింది. శర్వానంద్ తాజాగా తనభార్యతో కలిసి అమెరికా వెళ్లాడట.. అయితే ఆమె అక్కడ జాబ్ చేస్తుంది కదా.. ఆ పనిమీదో.. లేక కొత్త జంట వెకేషన్ కో కాదు. శర్వానంద్ కు ఓ చిన్న సర్జరీ చేయాల్సి ఉందట దాని కోసం అక్కడికి వెళ్ళారని న్యూస్ వైరల్ అవుతోంది.
జాను మూవీలో షూటింగ్ సమయంలో శర్వాకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం వల్ల ఆయన కాలుకు దెబ్బతగిలిందట. దాని వల్ల కొంతకాలం తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారంట శర్వానంద్. దాంతో ఆ గాయాం ఇబ్బందిపెట్టకుండా ఉంటాలంటే ఓ సర్జరీ చేయాల. అందుకే ఈ సర్జరీ చేయించుకోవడం కోసం శర్వానంద్ అమెరికా వెళ్ళినట్టు సమాచారం అందుతోంది. అమెరికాలోని బెస్ట్ హాస్పిటల్ లో సర్జరీకి శర్వానంద్ సిద్దం అయినట్టు సమాచారం. శర్వాకు ఆపరేషన్ అన్న విషయం తెలిసిన తర్వాత అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి షూటింగ్ లో పాల్గొనాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.
సర్జరీ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడని తెలుస్తుంది. ఇటీవల బేబీ ఆన్ బోర్డ్ అనే మూవీకి ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి తో ఓ మూవీలో నటించబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో గమ్యం, ప్రస్థానం మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్. 2003లో ఐదో తారీఖు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శర్వానంద్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. 2014 రన్ రాజా రన్ చిత్రంతో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నడు శర్వానంద్.
