Asianet News TeluguAsianet News Telugu

కరోనాతో టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. 

tollywood young director kumar vatti passed away due to corona  arj
Author
Hyderabad, First Published May 1, 2021, 9:24 AM IST

కరోనాకి మరో సినీ ప్రముఖుడు బలయ్యారు. టాలీవుడ్‌లో యంగ్‌ డైరెక్టర్‌ కుమార్‌ వట్టి కన్నుమూశారు. ఆయన హీరో శ్రీవిష్ణుతో `మా అబ్బాయి` సినిమాని తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితం కుమార్‌ వట్టికి కరోనా సోకింది. ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. కుమార్‌ వట్టి మరణం టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేసింది. కుమార్‌ వట్టిది శ్రీకాకుళం జిల్లాలోని నర్సన పేట. దర్శకుడు పరశురామ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పనిచేశాడు. 2017లో శ్రీ విష్ణుతో `మా అబ్బాయి` సినిమాని రూపొందించారు. 

ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో పలువురు స్టార్స్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌కి కరోనా సోకింది. పూజా హెగ్డే, కళ్యాణ్‌ దేవ్‌ లకు సైతం కరోనాకి గురయ్యారు. దీంతోపాటు బండ్ల గణేష్‌, దిల్‌రాజు, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నివేదా థామస్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఇలానే అనేక మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios