న్యూ ఇయర్ వేడుకలకు గోవా బాటలో టాలీవుడ్ సెలెబ్స్
- కొత్తసంవత్సరం వేడుకలకు మరి కాసేపట్లో ముహూర్తం
- ప్రపంచమంతా న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు రెడీ
- గోవాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకనున్న తెలుగు సినీతారలు
కొత్త సంవత్సరం వేడుకలంటే అందరికీ ఎంతో ప్రత్యేకం. మరి ఏకంగా సెలెబ్రిటీలే అయితే వాళ్లు సెలిబ్రేట్ చేసుకునే రేంజ్ వేరుగా ఉంటుంది. ఈసారి టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది గోవాలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారు. ఎంత మందో తెలుసా... దాదాపు అంతా. విదేశాల్లో ఉన్న ఒకరిద్దరు మినహా అంతా గోవాలోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు వెళ్లారు. బ్యాచ్ లు బ్యాచ్ లుగా గోవాలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రెడీ అయ్యారు టీటౌన్ హీరోస్ అండ్ బ్యూటీస్.
వెళ్లినవాళ్లంతా సింగిల్ గా కాదు సుమా.. జంటగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి గోవా వెళ్లిపోయారు టాలీవుడ్ జంటలు. వాళ్ల పార్ట్ నర్స్ తో కూడా వెళ్లారు కొందరు. ఇలా వెళ్లిన వాళ్ళలో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి , నాగచైతన్య సమంత , అఖిల్ శ్రియా భూపాల్ లు ఉన్నారు. వీళ్ళతో పాటు గా రకుల్ ప్రీత్ సింగ్ , రాశి ఖన్నా , రానా లు ఉన్నారు.
అల్లు అర్జున్ పెద్ద బ్యాచ్ ని మెయింటన్ చేస్తున్నాడు ఆ బ్యాచ్ లో మంచు లక్ష్మి కూడా ఉంది. ఇక వీళ్ళంతా కలిసి గోవా లోని ఓ ఐలాండ్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం చాలా రోజుల ముందు గానే ప్రిపరేషన్ మొదలు పెట్టారు. మొత్తానికి ఈ 2016 కి గుడ్ బై చెప్పేసి 2017 కి గోవా వేదికగా ఘన స్వాగతం పలుకుతున్నారు.