Asianet News TeluguAsianet News Telugu

‘ఎన్బీకే107’ టైటిల్ కు ముహూర్తం.. ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్ యాక్షన్ ఫిల్మ్ ‘ఎన్బీకే107’. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనా ఇప్పటికీ టైటిల్ ను రిలీజ్ చేయలేదు మేకర్స్. తాజాగా టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

Time for the title of NBK107, When are they going to announce it?
Author
First Published Sep 15, 2022, 5:03 PM IST

టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్టుల్లో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్  ఒకటి. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘ఎన్బీకే107’ వర్క్ టైటిల్ తో శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ‘క్రాక్’తో హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేనినే బాలయ్య చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రంలోని కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు, సాంగ్స్ షూటింగ్ కోసం NBK107 టీమ్ విదేశాలకు వెళ్లింది. త్వరలోనే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేలా దర్శకుడు గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడా ఆలస్య కాకుండా చూసుకుంటున్నారు. 

గత కొద్ది రోజులుగా సౌత్ ఇండస్ట్రీల్లో రూపుదిద్దుకుంటున్న స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ ను అనౌన్స్ చేయడం  లేదు. సినిమా ప్రారంభమై..  షూటింగ్ కూడా తుదిదశకు వస్తున్నా ప్రకటించడం లేదు. ఇన్ని రోజులు ‘ఎన్బీకే107’లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా సమాచారం ప్రకారం.. మేకర్స్ టైటిల్ ను అనౌన్స్ చేసే పనిలోనే ఉన్నారని తెలుస్తోంది. దసరా పండుగ సందర్భంగా ‘ఎన్బీకే107’ నుంచి మాస్ టీజర్ ను వదలే క్రమంలోనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారంట. మరోవైపు దసరాకే టైటిల్ వచ్చేస్తుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

బాలయ్య చిత్రాలంటే ముఖ్యంగా కథ, ఆ తర్వాత ‘టైటిల్స్’కే ప్రాధాన్యత ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా నందమూరి అభిమానులు అస్సలు సహించరు. ఈ క్రమంలో ‘ఎన్బీకే107’ టైటిల్ పై బాగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ‘అన్నగారు’, ‘జై బాలయ్య’ టైటిళ్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు చిత్రంలోనూ ‘జై బాలయ్య’సాంగ్  ఉండటంతో ఈసారి కచ్చితంగా అదే టైటిల్ ను ఖరారు చేసి ఉంటారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చూడాలి మారి బాలయ్య క్రేజ్ కు తగ్గట్టుగా ఎలాంటి టైటిల్ ను ఫైనల్ చేస్తారన్నది.

ఇక ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య ‘ఎన్బీకే107’తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూవీలోని డైలాగ్స్, సీన్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి.  ఇటీవల దర్శకుడు గోపీచంద్ పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ పిక్ తోపాటు, టర్కీలోని షూటింగ్ లోకేషన్స్ కు సంబంధించిన ఫొటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ శ్రుతి  హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios