ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రానికి మూడు టైటిల్స్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రానికి మూడు విభిన్న టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఓకే అయ్యిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రశాంత్ నీల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కు కథ ఏమై ఉంటుందా...ఎన్టీఆర్ ని ఎలా చూపబోతున్నారు..టైటిల్ ఏమై ఉంటుందనే విషయాలపై ఫ్యాన్స్ మధ్య చర్చ మొదలైంది. ఈ లోగా మైత్రీ మూవీ మేకర్స్ వారు రెండు టైటిల్స్ ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ టైటిల్స్ ఏమిటంటే న్యూక్లియర్, మిస్సైల్. దాంతో ఈ రెండు టైటిల్స్ ఒకటి ఈ సినిమాకు ఖచ్చితంగా పెడతారని అంటున్నారు.
ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్కు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ.. అతనితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు చెప్పకనే చెప్పాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ .. త్వరలోనే రేడియేషన్ సూట్ ధరించి మీ వద్దకు రాబోతున్నా అని ట్వీట్ చేసాడు. అలాగే జూన్ 4న ప్రశాంత్ నీల్ పుట్టినరోజున ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. గొప్ప మనసు కలిగిన దర్శకుడికి శుభాకాంక్షలు అంటూ .. త్వరలో మిమ్మల్ని రేడియేషన్ సూట్లో కలవబోతున్నాం అంటూ ట్వీట్ చేసారు. ఈ రెండు ట్వీట్స్ బట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాకు రేడియేషన్ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
కేజీఎఫ్ లాగానే ఎన్టీఆర్ సినిమాలోనూ భారీ ఎలివేషన్ సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ల కాంబోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే మైత్రీ సంస్థ ప్రశాంత్కు రూ.2కోట్లు అడ్వాన్సు ఇచ్చినట్టు ఇండస్ట్రీ టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇది 2022లో ఈ క్రేజీ మూవీ సెట్స్పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పుడాయన ‘కేజీఎఫ్’ సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమా పనులు చివరిదశకు వచ్చేశాయి.