‘వారసుడు’ ఆడియో లాంచ్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఇంతకీ ఈవెంట్ ఎప్పుడు?
తమిళ స్టార్ హీరో విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేష న్ లో బైలింగ్వుల్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘వారసుడు’. రిలీజ్ కు సిద్ధం అవుతున్న ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) - దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ‘వారసుడు’. బైలింగ్వుల్ గా తెరకెక్కుతోంది. తమిళంలో ‘వరిసు’ టైటిట్ లో విడుదల కాబోతోంది. తెలుగులోనూ విజయ్ కు మంచి మార్కెట్ ఉండటంతో తొలిసారిగా డైరెక్ట్ గా తెలుగులో నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటం మరింతగా అంచనాలు పెంచేస్తోంది.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్సాన్స్ దక్కుతోంది. చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సింగిల్ ‘రంజితమే’ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు మ్యూజిక్ ఫీస్ అందిచబోతున్నారు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అవుట్ ఇచ్చారు.
‘వరిసు’ ఆడియో లాంఛ్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. తళపతి రాకతో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 24న సాయంత్రం 4 గంటలకు ఆడియో లాంఛ్ ఈవెంట్ ఉంటుందని తెలిపారు. దీంతో ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఖుషీ అవుతున్నారు. ‘వరిసు’ రిలీజ్ పై అటు వివాదాలు పుట్టుకొస్తున్నా.. మరోవైపు అంచనాలను పెంచేస్తూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన ‘సోల్ ఆఫ్ వరిసు’తో మరింత హైప్ క్రియేట్ చేశారు.
విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ సరసన ఆడిపాడనుంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదలలో ఎలాంటి మార్పు లేకుండా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.