ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పెషల్ కమిటీ బుధవారం కీలక భేటీ నిర్వహిస్తోంది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పెషల్ కమిటీ (telugu film chamber) బుధవారం సమావేశమైంది. ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ (producers gild) ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో.. చిత్రీకరణల నిలిపివేతపై ఛాంబర్ క్లారిటీ ఇవ్వనుంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ఫెడరేషన్ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాస్ట్ కటింగ్, ఓటీటీ, ఫెడరేషన్ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి టాలీవుడ్ సినిమాల షూటింగ్లను నిలిపివేయాలని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి చర్చలు, సమస్యల పరిష్కారానికి పరిష్కారాల కనుగొనేవరకు వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. సినిమాల థియేటరిక్ వసూళ్లు తక్కువ స్థాయికి పడిపోవడం.. ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగడంతో.. పరిశ్రమను పునర్నిర్మించే ప్రయత్నంలో నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
Also REad:రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒకే..?
అయితే సినిమా షూటింగ్లను నిలిపివేయాలనే నిర్ణయం పలు అగ్ర హీరోల చిత్రాలపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. షూటింగ్ల బంద్ నిర్ణయంపై అగ్ర హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్తో చర్చలు జరిపారు. అయితే వీరు ముగ్గురు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ముందుకొచ్చినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ కంట్రోల్లో భాగంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటామని ఆ హీరోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, త్వరలోనే మిగతా హీరోలతో కూడా చర్చలు జరుపుతామని నిర్మాతలు చెబుతున్నారు.
