Asianet News TeluguAsianet News Telugu

నొప్పించి ఉంటే క్షమించండి : తనికెళ్ల భరణి

ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు.

Tanikella Bharani gives apology jsp
Author
Hyderabad, First Published Apr 16, 2021, 7:23 AM IST

ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొద్దిరోజుల కిందట ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై భిన్నమైన వాదనలు మొదలైయ్యిన సంగతిత తెలిసిందే. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి ట్విటర్‌  ద్వారా స్పందించారు.  ఏ మనిషికీ ఇతరుల మనసును నొప్పించే హక్కు  లేదని.. తాను ఎవరికీ వ్యతిరేకం కాదని  తనికెళ్ల భరణి అన్నారు. కొద్దిరోజుల కిందట ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్టుపై కొంతమంది నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలో తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక వీడియో పంచుకున్నారు.

 ‘శభాష్‌ రా శంకరా..’ అంటూ గత కొన్ని రోజులుగా నేను ఫేస్‌బుక్‌లో పోస్టూ చేస్తూ వచ్చాను. అయితే.. ఆ వ్యాఖ్యలు కొంతమంది మనసును నొప్పించాయని తెలిసింది. దీంతో ఆ పోస్టు తొలగించాను. దీనిపై నేను వివరణ ఇవ్వాలని అనుకోవట్లేదు. నాకు హేతువాదులన్నా.. మానవతావాదులన్నా గౌరవమే తప్పితే వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషినీ నొప్పించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అందుకే జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నా’ అంటూ తనికెళ్ల భరణి వీడియో ద్వారా తెలియజేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios