Asianet News TeluguAsianet News Telugu

సుహాసిని, త్రివిక్రమ్‌, ప్రకాష్ రాజ్‌లకు తనికెళ్ల భరణి ఛాలెంజ్‌ (వీడియో)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.

Tanikella Bharani Accepts Green India Challenge
Author
Hyderabad, First Published Aug 27, 2020, 12:37 PM IST

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి తన నివాసంలో మొక్కలు నాటారు.  అనంతరం మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్  గారు హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.
"

Follow Us:
Download App:
  • android
  • ios