ప్రముఖ కమెడియన్ కన్నుమూత, షాక్ లో తమిళ సినీ పరిశ్రమ
తమిళ సినీపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరున్న బోండా మణి కన్ను మూశారు. కొంత కాలంగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన రీసెంట్ గా తుది శ్వాస విడిచారు.
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వరుసగాసినిమా తారలు ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. భాషతో సబందం లేకుండా.. ఎందరో తారలు నేల రాలారు. ఈ ఏడాది సినీ పరిశ్రమలో మరణాలు ఎక్కువనే చెప్పాలి. తెలుగులో దిగ్గజనటులంతా ఈ ఏడాదే మరణించగా.. తమిళనాట కూడా పేరున్న నటులు వరుసగా మరణించారు. ఈక్రమంలో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ హాస్యనటుడు బోండా మణి (60) కన్నుమూశారు.
కిడ్నీల సమస్యతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్నారు బోండా మణి. తన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ఏడాది కాలంగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. కాని గత వారం రోజులుగా పరిస్థితి విషమించింది. రాను రాను పరిస్థితి చేయిదాటిపోయిందని ఆ యన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని.. చికిత్స పొందుతున్న క్రమంలోనే బోండా మణి మరణించరని వైద్యులు తెలిపారు. ఈ వార్త తెలసి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. సినీతారలు మణి కుటుంబ సబ్యులకుసాను భూతి తెలుపుతున్నారు.
ఇక మణి పర్సనల్ విషయాలకు వస్తే..ఆయన శ్రీలంక తమిళుడు. బోండా మణి 1991లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అలనాటి స్టార్ డైరెక్టర్ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన పౌను పౌనుతాన్స సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు బోండా మణి. ఆతరువాత మణి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. బోండా మణి తన కెరీర్ లో స్టార్ కమెడియన్ వడివేలు కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేశారు. దాంతో వడివేలుతో మణి అనుబంధం ఎక్కువగా ఉంటుంది.
సుందర ట్రావెల్స్, మరుదామలై, విన్నర్, అయి, వసీకరా, లాంటి చిన్న చిన్న పాత్రలతో ప్రారంభించి హాస్య నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగాతమిళ స్టార్ హీరోల సినిమాలకు ఆయన పనిచేశారు. మణి కామెడీ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. దాదాపు 300 వందలకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు బోండా మణి. అంతే కాదు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు తెరపై కూడా కనిపించారు