ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, ఆకాశమే నీ హద్దురా యాక్టర్ కన్నుమూత
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రముఖులను , అభిమానులను , ప్రేక్షకులను శోకసంద్రంలో పడేస్తున్నాయి. ప్రతి రోజు ఏదొక ఇండస్ట్రీ లో ఎవరొకరు పలు కారణాలతో మరణిస్తున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో ఓ నటుడి మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు సినీ ప్రముఖులను , అభిమానులను , ప్రేక్షకులను శోకసంద్రంలో పడేస్తున్నాయి. ప్రతి రోజు ఏదొక ఇండస్ట్రీ లో ఎవరొకరు పలు కారణాలతో మరణిస్తున్నారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో ఓ నటుడి మరణం ఇండస్ట్రీని కలచివేస్తోంది.
కోలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్య వరుసగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవారు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. సౌత్ నుంచి ఎక్కువగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కోలీవుడ్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాము రోజ్ కన్ను మూశారు.
సోమవారం ఆకాశం నీ హద్దురా నటుడు రామురోజ్ కన్నుమూశాడు. శుక్రవారం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసారు. అప్పటి నుండి చికిత్స పొందుతూ వస్తున్న రామురోజ్ సోమవారం తుదిశ్వాస విడిచాడు. 2008లో వచ్చిన పూ సినిమాతో ఈయనకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఇండస్ట్రీలో ఈయనను పూ రాము అంటూ పిలుస్తున్నారు. నీర్పరవై, పరియేరుమ్ పెరుమాల్, నీడునాల్వాడై, సూరరై పొట్రూ వంటి సినిమాలో కోలీవుడ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆకాశం నీ హద్దురా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సూర్య తండ్రిగా మంచి నటనను కనబరిచాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు సైన్ కూడా చేశాడట. ఇక ఈయన మరణవార్త విన్న సీ.ఎం స్టాలిన్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్ట్రీట్ అర్టిస్టు నుండి గొప్ప నటుడిగా ఎదికి రామురోజ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు అంటూ సంతాపం తెలిపారు. ఉదయనిధి స్టాలిన్ హాస్పిటల్కు వెళ్ళి నివాళులు అర్పించాడు. రాము అంత్యక్రియలు ఉరపక్కంలోని తన నివాసంలో మంగళవారం జరుగనున్నాయి. మరణ వార్త విన్న పలువురు కోలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు.