టార్గెట్ సెట్ చేసుకున్న సైరా..!
టాలీవుడ్ లో బాహుబలి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న చిత్రాల్లో సైరా ఒకటి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ లో బాహుబలి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతున్న చిత్రాల్లో సైరా ఒకటి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 200కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక సినిమాను అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్బంగా భారీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. సినిమాను అదేరోజున రిలీజ్ చెయ్యడానికి ముఖ్యకారణం ఉంది. అక్టోబర్ 8న దసరా కావడంతో సెకండ్ వీక్ నుంచి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా 200కోట్ల షేర్స్ ను అందుకోవాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది.
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ మూడు వందల కోట్లు ఈజీగా అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు సంబందించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
(200కోట్ల నుంచి 600కోట్ల) భారీ బడ్జెట్ చిత్రాలతో రెడీ అవుతున్న మన స్టార్స్