Asianet News TeluguAsianet News Telugu

#Devara:ఎన్టీఆర్ 'దేవర' రైట్స్ ..వీళ్లిద్దరి మధ్యే పోటీ, ఎవరికి దక్కేనో

ప్రొడక్షన్ సైడ్ నుంచి  డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చిన మైత్రీ వారు దిల్ రాజు కు పోటీ ఇస్తూ తమ కు వచ్చిన ఏ అవకాశం మిస్ చేసుకోవటం లేదు. 

SVC and Mythri Movies are in a race to acquire the theatrical rights of #Devara jsp
Author
First Published Jan 21, 2024, 12:59 PM IST


‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. దేవర కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన  దేవర గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లిప్స్ చూసిన వారంతా ఎన్టీఆర్ కెరియర్ లో దేవర బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల రైట్స్ కు ఓ రేంజిలో పోటీ నెలకొని ఉంది. 

అందుతున్న సమాచారం మేరకు తెలుగులో మైత్రీ మూవీస్ వారు, దిల్ రాజు మధ్యే ఈ పోటీ నెలకొని ఉందని, వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ రేటు కోట్ చేస్తే వాళ్లకు డీల్ ఓకే చేసి క్లోజ్ చేస్తారని తెలుస్తోంది. మామూలుగా అయితే దిల్ రాజుకే ఈ రైట్స్ వెళ్లేవి. కానీ మైత్రీ వారు గట్టి పట్టుదలతో ఉన్నారు. దాంతో   ఈ రైట్స్ ని మైత్రీ మూవీస్ వారికే వెళ్లే అవకాసం ఉందంటున్నారు. ప్రొడక్షన్ సైడ్ నుంచి  డిస్ట్రిబ్యూషన్ లోకి వచ్చిన మైత్రీ వారు దిల్ రాజు కు పోటీ ఇస్తూ తమ కు వచ్చిన ఏ అవకాశం మిస్ చేసుకోవటం లేదు. హనుమాన్ , సలార్ లతో నైజాంలో సక్సెస్ చూసిన మైత్రీవారు దేవర రెండు రాష్ట్రాల తెలుగు రైట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్, కొరటాల శివ, మైత్రీ మూవీస్ కు మంచి  rapport ఉండటం కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు.

 గతంలో మైత్రీ  బ్యానర్ ని తెలుగులోకి కొరటాల శివ తమ శ్రీమంతుడు చిత్రంతో తెచ్చారు. అలాగే ఆ తర్వాత అదే కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్,మోహన్ లాల్ కాంబో లో జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ కొట్టారు. దాంతో ఇప్పుడు తమ ఉన్న పరిచయం,స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారని చెప్తున్నారు.అలాగే ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి సైతం మైత్రీ వారే నిర్మాతలు కావటం విశేషం. దేవర తెలుగు రైట్స్ ని 110 కోట్లుకు అడుగుతున్నారని,బేరసారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రక్క దేవర నిర్మాతలు 145 కోట్ల  థ్రియేటర్ బిజినెస్ ని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 
 
 ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది. ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా టాకీ పార్ట్‌ తీస్తారని తెలిసింది. అలాగే ఈ షెడ్యూల్‌లోనే ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉందట యూనిట్‌. న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల తర్వాత ఎన్టీఆర్‌ ‘దేవర’ షూటింగ్‌లో జాయిన్‌ కావడం ఇదే. రెండు భాగాలుగా కల్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ తొలి భాగం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

  దేవర సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అన్నారు. అందుకే ఒకే భాగంలో దేవర కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తోందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్‌ల్లో దేవర సినిమాను తీసుకురావాలని నిర్ణయించినట్టు వివరించారు. రూ.300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్   విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.   ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios