Asianet News TeluguAsianet News Telugu

sushant singh: సుశాంత్ సింగ్ సూసైడ్ ప్లాట్ కొన్న తెలుగు హీరోయిన్.. నిజమేనా...?

కొన్నేళ్ల క్రితం సూసైడ్ చేసుకుని చనిపోయాడు.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఇక ఆయన మరణించిన ఇన్నాళ్లకు.. సుశాంత్ ఇల్లు అమ్మకానికి వచ్చిందట. ఇందులో నిజమెంత. 

sushant singh rajput suicide house for sale jms
Author
First Published Nov 26, 2023, 2:43 PM IST


బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో... సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ త‌న కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్ లో సూసైడ్ చేసుకున్నారు.  ముంబై బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉండే సుశాంత్.. ఆఇంట్లోని తన బెడ్ రూమ్ ల ఉరివేసుకుని మరణించాడు. అయితే ఈ యంగ్ హీరో మరణానికి అనేకకారణాలున్నాయని, ప్రేమ వ్యవహారం, డ్రగ్స్ ఇలా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. అలాగే.. బాలీవుడ్ పెద్దలు అతని టాలెంట్ ను పైకి రానివ్వకుండా అడ్డుకోవడం, నెపోటిజంకారణంగానే అతను మరణించాడటి వాదణ కూడా  అప్పట్లో బలంగా వినిపించింది. నెపోటిజం కారణంగానే సుశాంత్ చనిపోయాడన్నది పచ్చినిజమని ఆ తర్వాత పలువురు ఆరోపించారు.

అయితే ప్రస్తుతం సుశాంత్ నివసించిన ఇంటికి సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సుశాంత్ నివసించిన  ఆ ప్లాట్ చాలా ప్పెషల్ గా ఉంటుందట.  స‌ముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్‌కు అత‌డు నెల‌కు దాదాపు  4.5 ల‌క్ష‌లు కట్టేవారని సమాచారం. అయితే మరో వాదన కూడా ఇక్కడ ఉంది. ఈ ఇంటిని ఆయన కొనుగోలు చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. 

2020 జూన్ 14న తన ప్లాట్‌లోనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అత‌డి మ‌ర‌ణం అంద‌రిని షాక్‌కు గురి చేసింది. ఆయ‌న ఎందుకు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు అన్న సంగ‌తి ఇంత వ‌ర‌కు తెలియ‌రాలేదు.సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌రువాత ఆ ప్లాట్‌లో అద్దెకు ఉండేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ట‌. కొంద‌రు ఆ ప్లాట్‌ను కొనేందుకు ముందుకు వ‌చ్చినా..  అది కుదరలేదు. ఆ ఇంటి యజమాని కూడా అమ్మడం ఇష్టం లేక అద్దెకు ఉండటానికి ఇస్తాను అన్నాడట. కాని ప్రస్తుతం ఎవరూ అద్దెకు రాకపోవడంత.. ఇంటిని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

sushant singh rajput suicide house for sale jms

కాగా.. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంటిని అమ్మకానికి పెట్టారన్న వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు తెలుగు హీరోయిన్ ఆదా శర్మ ఇంట్రస్ట్ చూపిస్తోందని వార్తలు గతంలో వచ్చాయి.  కేరళ స్టోరీ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఆదాశర్మ.. ఇప్పటి వరకూ తన తల్లిదండ్రులతోనే కలిసి ఉంటోంది. తనకంటూ సొంతిల్లు ఉండాలనుకున్న ఆమె.. సుశాంత్ ఇంటిని కొనుగోలు చేయనుందని వార్తలు గతంలో వచ్చాయి. కాని అందులో నిజం లేదు అని అదా శర్మ క్లారిటీ కూడా ఇచ్చింది. మరి ఈ ఇంటిని ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలి. ఇక ఈ ఇంటి అమ్మకంలో  నిజమెంతుందో తెలియాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios