ఈ సారి జాతీవ అవార్డ్స్ లో సూర్య  స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన నటించిన సూరారై పోట్రు  సినిమాఐదు అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా సూర్య కూడా నేషనల్ అవార్డ్ సాధించారు. ఇక ఈ విషయంలో ఆయన ఒక పర్సన్ కు స్పెసల్ థాంక్స్ చెప్పారు. 


కేంద్రం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను ప్రకటించింది. 68వ జాతీయ అవార్డ్స్ లో సారి సౌత్ నుంచి కోలీవుడ్ ఎక్కువగా అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. అందులో సూరారైపోట్రు అనగా తెలుగలో ఆకాశమే నీహద్దురా సినిమా ఏకంగా ఐదు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి నాలుగు అవార్డ్స్ రాగా తమిళ పరిశ్రమ 7 జాతీయ అవార్డ్స్ తో టాప్ లో ఉంది. 

ఈసారి బెస్ట్ హీరోగా సూర్యఅవార్డ్ సాధించారు అంతేకాదు ఈఅవార్డ్ సాధించడానికి కారణంఅయిన వారికి తన మనస్పూర్థిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్య తన భార్య జ్యోతికకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ను ఎంతగానో ప్రోత్సహించిన తన భార్య జ్యోతికకు కూడా సూర్య స్వీట్ గా థ్యాంక్స్ చెప్పాడు. నా జ్యోతికకు ప్రత్యేకంగా థాంక్స్. సూరారై పోట్రు సినిమాను నిర్మించేందుకు, అందులో నటించేందుకు ఆమే నన్ను ప్రోత్సహించింది. ఇప్పటి వరకు నా కృషిని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ, మా అమ్మ, అప్ప, కార్తీ, బృందాలకు కూడా ప్రేమతో థాంక్స్ చెప్పారు సూర్య. 

Scroll to load tweet…

అంతే కాదు నా పట్ల ప్రేమ చూపించి, శుభాకాంక్షలు చెప్పిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సూరారై పోట్రుకు ఐదు అవార్డులు రావడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో ఓటీటీ ద్వారా నేరుగా విడుదల చేసిన ఈ సినిమాకు తగిన గుర్తింపు , గౌరవం లభించింది. ఆనందంతో మా కళ్లు చెమర్చేలా చేసింది అన్నారు సూర్య. 

సూరారై పోట్రుకు దేశవ్యాప్త గుర్తింపు లభించడతో తమ సంతోషం రెట్టింపైంది అన్నారు సూర్య. ఈ విషయంలో డైరెక్టర్ సుధ కొంగర ఎన్నో ఏళ్ల శ్రమ, కెప్టెన్ గోపీనాథ్ స్టోరీ విజన్ కు ఇది నిదర్శనం అన్నారు తమిళ స్టార్ హీరో. ఈ సినిమాకు పనిచేసి బెస్ట్ యాక్ట్రస్ గా అవార్డ్ సాధించిన అపర్ణ బాలమురళి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో అవార్డ్ సాధించిన జీవీ ప్రకాష్ , డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్న సుధ కొంగర, ఉత్తమ స్క్రీన్ ప్లే కు అవార్డ్ పొంది. షాలిని ఉషా నాయర్ లకు సూర్య అభినందనలు చెప్పాడు. ఈ మేరకు ఓ పెద్ద లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.