ఆరు చిత్రాలను విడుదల చేస్తున్న సురేశ్ ప్రొడక్షన్స్
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్.
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్. ప్రస్తుతం దాదాపుగా ఆ సంస్థ నుంచి డజను చిత్రాలు పైప్ లైన్లో ఉన్నాయి. వాటిలో అరడజను చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో వ్యవహరిస్తారు ప్రముఖ నిర్మాత సురేశ్బాబు. ఆ నమ్మకంతోనే ఆయన తాజాగా ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సమంత నటించే `ఓ బేబీ`, అల్లు శిరీష్ నటించే `ఏబీసీడీ`, ఆనంద్ దేవరకొండ, శివాత్మిక నటించే 'దొరసాని', 'ఫలక్నుమాదాస్', 'మల్లేశం', శ్రీ విష్ణు, నివేదా థామస్ నటించే 'బ్రోచేవారెవరురా' వంటి చిత్రాలన్నీ సురేశ్బాబు సహకారంతో విడుదల కానున్నాయి.
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు చక్కటి రిలీజ్ డేట్, మంచి థియేటర్లు ఎంత ముఖ్యమో తెలిసిందే. సురేశ్ బాబు బ్యాకప్తో ఈ సినిమాలు అన్నిటికీ అలాంటి మంచి థియేటర్లు, మంచి రిలీజ్ డేట్ దొరికాయి.