సీఎం సహాయనిధికి రజినీకాంత్ భారీ సాయం!
ముఖ్యమంత్రి స్టాలిన్ ని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా విలయతాండం చేస్తుంది. రోజుకు పదుల సంఖ్యలలో కరోనా కారణంగా మృత్యువాత పడుతున్నారు. కోలీవుడ్ పరిశ్రమకు చెందిన అనేక మంది నటులు, సాంకేతిక నిపుణలు మృత్యువాత పడ్డారు. దీనితో బాధితుల సహాయార్థం ప్రభుత్వానికి సినీ ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. కొత్తగా ఎన్నికైన తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి తమ విరాళాలకు సంబంధించిన చెక్స్ అందజేస్తున్నారు.
తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ ని సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును స్టాలిన్కు అందజేసి ఆయన తిరిగి వెళ్లారు. తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సూర్య-కార్తి రూ.కోటి అందించారు. అలాగే, అజిత్, శివకార్తికేయన్ రూ.25 లక్షల చొప్పున విరాళాలు అందించారు.
ఇక ప్రస్తుతం అన్నాత్తే మూవీలో రజినీకాంత్ నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ అన్నాత్తే షూటింగ్ కోసం రజినీకాంత్ రావడం జరిగింది. మరోవైపు అన్నాత్తే మూవీలో తన పార్ట్ షూటింగ్ రజినీ పూర్తి చేసినట్లు సమాచారం అందుతుంది. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో మీనా, కుష్బూ, కీర్తి సురేష్ నటిస్తున్నారు.