Asianet News TeluguAsianet News Telugu

అమెరికా నుండి చెన్నై చేరుకున్న రజనీకాంత్, అభిమానుల ఘన స్వాగతం!

మూడు వారాలుగా అమెరికాలో ఉంటున్న రజినీకాంత్ నేడు చెన్నై చేరుకున్నారు. రజినీకాంత్ రాకను తెలుసుకున్న అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు.

super star rajinikanth back to chennai after a long america trip ksr
Author
Hyderabad, First Published Jul 9, 2021, 12:26 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండియా చేరుకున్నారు. జూన్ 16వ తేదీన భార్యతో పాటు రజినీకాంత్ ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లడం జరిగింది. అక్కడ మయో క్లినికల్ అనే ప్రముఖ హోస్పిటల్ నందు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మయో హాస్పిటల్ నుండి కూతురు ఐశ్వర్యతో బయటికి వస్తున్న రజినీకాంత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. 


2016లో రజినీకాంత్ అమెరికాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. అందువలన తరచుగా అమెరికా వెళ్లి ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉంటారు. తాజాగా మరోమారు రజినీకాంత్ అమెరికాలోని మయో హాస్పిటల్ నందు పరీక్షలు చేయించుకున్నారు. రజినీకాంత్ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్స్ ధృవీకరించడంతో తిరిగి చెన్నై చేరుకున్నారని తెలుస్తుంది. 


ఇక రజినీకాంత్ అమెరికా వెళ్లిన ప్రతిసారి ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ ఉంటారు. నేడు రజినీకాంత్ చెన్నై వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ఎయిర్ పోర్ట్ లో ఆయన రాక కోసం ఎదురుచూశారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటికి వస్తున్న రజినీని చూడడానికి ఉత్సాహపడ్డారు. అభిమానులకు అభివాదం చేసిన రజిని, కారులో నివాసానికి వెళ్లడం జరిగింది. 


ప్రస్తుతం సూపర్ స్టార్ అన్నాత్తే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. దాదాపు షూటింగ్ చివరి దశలో ఉండగా..నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios