Bigg Boss Telugu 5 : అత్యంత ఫేక్ పర్సన్ రవి అంటూ సన్నీ స్టేట్మెంట్.. శ్రీరామ్ మీదికి రావడంతో హీటెక్కిన హౌజ్
bigg boss telugu 5.. 12వ వారంలో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో నామినేషన్ల ప్రక్రియ మరింతగా హీటెక్కింది.
బిగ్బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5 )వ సీజన్.. పన్నెండో వారానికి చేరుకుంది. ఇంకా మిగిలింది మూడు వారాలే. ఇప్పటి వరకు హౌజ్ నుంచి 11 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్లో ఎనిమిది మంది ఉన్నారు. హౌజ్లో సభ్యులు తగ్గేకొద్ది మరింత ఉత్కంఠ నెలకొంటుంది. హీటెక్కుతుంది. గేమ్ మరింతగా రక్తి కడుతుంది. అదే సమయంలో సభ్యుల మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా పెరుగుతుంది. ఇక 12వ వారంలో భాగంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. మరోసారి ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడంతో నామినేషన్ల ప్రక్రియ మరింతగా హీటెక్కింది.
ఇందులో భాగంగా Bigg Boss Telugu 5 ఈ సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలో..గత ఎలిమినేషన్కి సంబంధించిన చర్చ జరిగింది. అనీ మాస్టర్ ఎలిమినేట్ కావడంతో సభ్యులు తమ బాధని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆదివారం చర్చకు వచ్చిన విషయాలను ప్రస్తావించుకున్నారు. కాజల్.. శ్రీరామ్ని నిలదీసింది. ఎమోషనల్గా కనెక్షన్ వస్తుందని గతంలో అన్న మాటని కాజల్ ప్రశ్నించగా, శ్రీరామ్ నేనెప్పుడు అన్నా అంటూ షాకిచ్చాడు. వాష్రూమ్ క్లీనింగ్కి సంబంధించిన చర్చ వచ్చింది. సన్నీ, మానస్ ల మధ్య డిస్కషన్ జరిగింది. రవి కెప్టెన్గా ఉన్నప్పుడు అసలు క్లీన్ చేయలేదని, ఆయన పని చేయలేదని తెలిపారు మానస్. మరోవైపు సన్నీ, మానస్ తమ ఫ్రెండ్ షిప్ని చాటుకున్నారు.
అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ఇంటి సభ్యుల దిష్టి బొమ్మలుంటాయి. వాటి తలపై మట్టి కుండ పెట్టి ఆయా సభ్యుడిని ఎందుకు నామినేట్ చేస్తున్నావో చెప్పి దాన్ని పగల గొట్టాల్సి ఉంటుంది. ఇందులో మొదట..రవి.. సన్నీ, కాజల్లను నామినేట్ చేశారు. తనపై ప్రశ్న రాయడంపై కాజల్ని రవి నామినేట్ చేశాడు. అలా చేయడం తప్పు అన్నాడు. నేను ఏం రాయాలో, ఎక్కడ రాయాలో కూడా నువ్వే చెబుతావా? అంటూ నిలదీసింది కాజల్. సన్నీ, రవి మధ్య హాట్ హాట్గా డిస్కషన్ జరిగింది. మరోవైపు పింకీ.. షణ్ముఖ్, సిరిలను నామినేట్ చేసింది. ఏదైనా అంటే ముఖం మీద అను అని సిరికి చెంది పింకీ.
షణ్ముఖ్.. రవి, కాజల్లను నామినేట్ చేశారు. రవి సంచాలక్గా బాగా చేయలేదని, కెప్టెన్సీగా బెటర్గా చేయలేదని నామినేట్ చేశాడు షన్ను. శ్రీరామ్.. సన్నీ, కాజల్లను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్..సన్నీకి ఇవ్వడంపై ఆయన కాజల్ని నామినేట్ చేశాడు. అది తన గేమ్ అని చెప్పింది కాజల్. అనీ మాస్టర్ వెళ్లిపోతారని తనకు ముందే తెలుసని శ్రీరామ్ అనడం షాక్కి గురి చేసింది. సన్నీ మధ్యలో మాట్లాడే ప్రయత్నంగా మధ్యలో మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. సిరి, షన్ను, రవి, నేను ఓ గ్రూప్ అని అన్నాడు శ్రీరామ్. అంతేకాదు ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల గ్రూప్ అని శ్రీరామ్ అనగా,ఆ గ్రూప్కి నేనే లీడర్ అంటూ సన్నీ వేసిన పంచ్ అదిరిపోయింది.
సన్నీ..శ్రీరామ్, రవిలను నామినేట్ చేశారు. వీరిమధ్య వాగ్వాదాలు పీక్లోకి వెళ్లాయి. రవి అత్యంత ఫేక్ పర్సన్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు సన్నీ. మరోవైపు శ్రీరామ్తోనూ గట్టిగా వాగ్వాదానికి దిగారు. ఒకరిపైకి ఒకరు మీద మీదికి వెళ్లారు. దీంతో హౌజ్ హీటెక్కిపోయింది. కెప్టెన్ మానస్ కల్పించుకుని శ్రీరామ్ని సముదాయించాడు. సిరి..రవి, పింకీని నామినేట్ చేసింది. కాజల్ రవి, శ్రీరామ్లను నామినేట్ చేసింది. వీరి మధ్య కూడా గట్టిగానే వాదనలు జరిగాయి. మొత్తంగా పన్నెండో వారంలో కెప్టెన్ మానస్ తప్ప అందరు సన్నీ, శ్రీరామ్, రవి, కాజల్, షణ్ముఖ్, సిరి, పింకీ నామినేషన్లో ఉన్నారు.