సావిత్రి, ఎన్టీఆర్.. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ!
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల అలనాటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల అలనాటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉయ్యాలవాడ చరిత్రతో 'సై రా', ఎన్టీఆర్, కపిల్ దేవ్, పుల్లెల గోపించంద్, జయలలిత వంటి సెలబ్రిటీల బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇప్పుడు టాలీవుడ్ లో మరో బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఆయన నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇప్పుడు కృష్ణ జీవితం ఆధారంగా సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన అల్లుడు, మహేష్ బావ అయిన సుధీర్ బాబు వెల్లడించారు.
తన తదుపరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వైజాగ్ వెళ్లిన సుధీర్ బాబు అభిమానులను ఉత్సాహ పరచడానికి ఈ విషయాన్ని చెప్పాడు. తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించాలని సుధీర్ భావిస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ బాబు తన తండ్రి బయోపిక్ కి సంబంధించి బాధ్యతలేమైనా తీసుకుంటారేమో చూడాలి!